తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Anantapur Andhra Pradesh March 01, 2026

అనంతపురం వాసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 

ఉద్యోగం అవకాశాలు పోరాటాల ద్వారా సాధ్యం. ఉద్యోగాలు కావాలంటే యువత పోరాటంలో ముందుండాలి. AIYF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ కుమార్ పేర్కొన్నారు 

అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన జి. సంతోష్ కుమార్‌కు ఘన అభినందన సభ ..

అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన జి. సంతోష్ కుమార్ గారికి, ఏఐఎస్ఎఫ్–ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘన అభినందన సభ నిర్వహించబడింది. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి గారు మాట్లాడుతూ, యువజన సమస్యల పరిష్కారానికి పోరాట పటిమతో ముందుకు సాగుతున్న నాయకత్వానికి ఇది గౌరవప్రదమైన గుర్తింపని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగం, విద్య, సామాజిక న్యాయం వంటి అంశాలపై యువతను సంఘటితం చేసి ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

సిపిఐ సహాయ కార్యదర్శి మల్లికార్జున గారు మాట్లాడుతూ, జి. సంతోష్ కుమార్ గారి నాయకత్వంలో ఏఐవైఎఫ్ మరింత శక్తివంతంగా మారి యువజన హక్కుల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి రమణయ్య గారు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కోట్రేశ్, ఏఐవైఎఫ్ నాయకులు ధనుదేవ, శ్రీనివాస్, అలాగే ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకట నాయక్, మంజునాథ్, చందు, సమీర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

అభినందన సభలో జి. సంతోష్ కుమార్ గారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. తనపై నమ్మకం ఉంచిన పార్టీ మరియు యువజన నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్రవ్యాప్తంగా యువజన సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.