Skip to main content

Posts

Showing posts with the label National

32 కార్లు… 8 మానవ బాంబులు

దేశాన్ని కుదిపేసే ఉగ్ర యత్నాన్ని భగ్నం చేసిన ఎన్‌ఐఏ దేశవ్యాప్తంగా సంచలనానికి గురిచేస్తూ, 32 కార్లలో బాంబులు అమర్చి, ఒకేసారి ఎనిమిది ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు సిద్ధమైన ఫరీదాబాద్‌ ఉగ్ర ముఠా భారీ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బయటపెట్టింది. ఇందులో పాల్గొన్న సభ్యులందరూ వైద్యులే కావడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అసాధారణ విధ్వంసానికి పన్నిన పథకం ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం — మొత్తం 32 కార్లను పేల్చే ప్రణాళిక వాటిని నాలుగు గ్రూపులుగా విభజించిన 8 మానవ బాంబులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాన లక్ష్యం ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ దీనికే వేదికగా హర్యానాలోని అల్‌ ఫలాహ్ యూనివర్సిటీ యూనివర్సిటీ హాస్టల్‌లోని 17వ భవనంలోని 13వ గది ఈ ముఠాకు ప్రధాన స్థావరంగా మారినట్లు గుర్తించారు. టర్కీ నుంచి ఆదేశాలు – ‘ఉకాసా’ అనే హ్యాండ్లర్ దాడుల వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై పరిశోధనలో కీలకమైన విషయం తెలిసింది. టర్కీలో ఉన్న ‘ఉకాసా’ అనే అనుమానాస్పద వ్యక్తి ఈ మాడ్యూల్‌కి నిరంతరం ఆదేశాలు ఇచ్చినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ కమ్యూనికేషన్ కోసం స్విట్జర్లాండ్‌కు చెందిన త్రీమా (Threema) య...

దిల్లీలో పేలుడు.. పోలీసులకు హైఅలర్ట్‌

దిల్లీ నగరంలో ఘోర పేలుడు చోటుచేసుకుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌ 1 వద్ద పార్కింగ్‌ స్థలంలో నిలిపివున్న ఓ కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ (LNJP) ఆస్పత్రికి తరలించారు. పేలుడు చోటుచేసుకున్న ప్రాంతంలో ఆందోళన నెలకొంది. వెంటనే దిల్లీ పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), క్లూస్‌ టీమ్‌, ఫోరెన్సిక్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. అసలు ఈ పేలుడు ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. ఏడు ప్రత్యేక బృందాలు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి విశ్లేషిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అపోహలు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

వెండిపైనా రుణాలు... ఆర్బీఐ కీలక నిర్ణయం!

దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీ రూ.1.70 లక్షల వరకు చేరిన వైనం ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్) వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల బరువులోపు సిల్వర్‌ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.1.70 లక్షల వద్ద ఉంది. కొన్ని నెలల క్రితం రూ.2 లక్షల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే. వెండి రేటు పెరగడానికి కారణాలు ...

వెండిపైనా రుణాలు... ఆర్బీఐ కీలక నిర్ణయం!

ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం  ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్) వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల బరువులోపు సిల్వర్‌ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.1.70 లక్షల వద్ద ఉంది. కొన్ని నెలల క్రితం రూ.2 లక్షల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే. వెండి రేటు పెరగడానికి కారణాలు వెండిని కేవలం ఆభరణాలకే కాకుండా పారిశ్రామిక రంగాల్లోనూ విస...

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు

     మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయారు   మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు ఆయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా మరియు అగ్ర నాయకుడిగా ఉన్నారు. మహారాష్ట్రలో 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. ఆయన నేపథ్యం గురించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి: మల్లోజుల వేణుగోపాలరావు నేపథ్యం    జననం, స్వస్థలం: వేణుగోపాలరావు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు మల్లోజుల వేణుగోపాలరావు, అయితే ఆయన మాదరి అనే పేరుతో కూడా సుపరిచితులు.   విద్య: ఆయన వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రస్తుత NIT-వరంగల్)లో ఇంజినీరింగ్ చదివారు.   పార్టీలో పాత్ర: ఆయన 1980లలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, భారతదేశంలో అతిపెద్ద మావోయిస్టు పార్టీ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.   ఆయన CPI కేంద్ర కమిటీ సభ్యుడిగా మరియు దండకారణ్యం స్పెషల్ జోన్ కార్యదర్శిగా పనిచేశారు.  పార్టీలో ఆయన భూపతి మరియు శ్రీనివాస్ వంటి పేర్లతో కూడా పిలవబడేవారు.  అగ్రనేత సోదరుడు:...

సమాచార హక్కు సామాన్యులకు ఎండమావేనా!

  ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు నాలుగు గోడల మధ్యలో పాలన చేస్తున్నట్టు కాకుండా పారదర్శకంగా చేస్తున్నట్టు ఉండాలి. పౌరులకు తెలియని స్థలమనేది ఉండకూడదు. రహస్య ప్రాంతాల్లో అవినీతి పెరిగిపోతుంది. అదే బహిరంగ ప్రదేశాల్లోనైతే నిర్మూలించబడుతుంది' అనిఅమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ అన్నారు. మన దేశంలో సమాచార హక్కు చట్టం ( రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ -2005 ) అమలులోకి వచ్చి 2025 అక్టోబర్ 12వ తేదీ నాటికి ఇరవై ఏండ్లు అవుతుంది. దేశ ప్రజాస్వామ్య పునాదిని పటిష్టంగా ఉంచే కీలకమైన చట్టాల్లో ఇది ఒకటి. ఓటు హక్కు తర్వాత అంతటి ప్రాధాన్యత కూడా దీనికే ఉంది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలైన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఇన్నేండ్లైనా కానీ.. ఆర్టీఐ అమలు తీరు 'మేడి పండు చందం'గానే ఉంది. సమాచార పారదర్శకతపై ప్రభుత్వాలు, అధికారులు చెప్పే మాటలకు.. చేతల్లో పొంతనే లేదు. సమాచార హక్కు ద్వారా ఆఫీసుల్లో పాలన రికార్డుల వివరాలను పొందడానికి ఎన్నో సవాళ్లను, అడ్డంకులను, వైఫల్యాలను ఎదుర్కొం టున్నారు. దీనికి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, పొరపాట్లు, వ్యవస్థ...

హోంవర్క్ చేయలేదని బాలుడిపై క్రూరశిక్ష.

చండీగఢ్‌ పానిపట్‌లోని శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. హోంవర్క్ చేయలేదని ఏడేళ్ల 2వ తరగతి బాలుడిని ప్రిన్సిపాల్‌ అమానుషంగా శిక్షించాడు. చిన్నారిని కిటికీకి తలకిందులుగా వేలాడదీయడమే కాకుండా, స్కూల్ బస్సు డ్రైవర్‌తో విచక్షణారహితంగా కొట్టించాడు. ఈ ఘటనతో విద్యార్థి భయభ్రాంతులకు గురయ్యాడు. చూసిన ఇతర పిల్లలు కూడా వణికిపోయారు. చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే ప్రిన్సిపాల్, డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. చిన్నారిపై ఈ రకమైన శారీరక, మానసిక హింస తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యావేత్తలు, తల్లిదండ్రులు “ఈ విధమైన మనస్తత్వం ఉన్నవాళ్లు స్కూల్ నడిపే అర్హత ఉన్నారా?” అని ప్రశ్నిస్తున్నారు. విద్య అనేది భయం కాదు, ప్రేరణ కావాలి అని వారు హితవు పలికారు.

రిజిస్టర్ పోస్టు విలీనం – తపాలా శాఖలో కొత్త మార్పులు

  న్యూఢిల్లీ: దేశ తపాలా సేవల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్ పోస్టు విధానంను తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. ఇకపై రిజిస్టర్ పోస్టు ఒక విలువ ఆధారిత సేవగా స్పీడ్ పోస్టు కింద అందుబాటులోకి రానుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ అమలులోకి వస్తోంది. అదనంగా కొత్తగా ఓటీపీ ఆధారిత డెలివరీ సేవను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిన ఉత్తరాలను చిరునామాదారుకే పోస్టుమన్ అందజేయాలి. ఇందుకోసం సంతకం తప్పనిసరి. ఈ సేవను వినియోగించుకోవడానికి నిర్దేశిత టారిఫ్‌పై ప్రతి ఆర్టికల్‌కు రూ.5 అదనంగా (జీఎస్టీ మినహాయించి) వసూలు చేయనున్నారు. ఇక స్పీడ్ పోస్టుకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన ఓటీపీ ఆధారిత డెలివరీ సేవలో, ఉత్తరం పంపిణీ సమయంలో చిరునామాదారుని మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ధృవీకరించిన తర్వాతే పోస్టుమన్ ఉత్తరాన్ని అందజేస్తాడు. ఈ సేవకూ నిర్దేశిత టారిఫ్‌పై రూ.5 అదనంగా చెల్లించాలి. విద్యార్థులకు ఉపశమనం స్పీడ్ పోస్టు చార్జీలను విద్యార్థులకు 10 శాతం...

స్వయం సమృద్ధి ద్వారానే ‘వికసిత్ భారత్’ సాధ్యం: ప్రధాని మోదీ.

న్యూఢిల్లీ: దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో నడవకపోతే ‘వికసిత్ భారత్’ లక్ష్యం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 126వ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ కొనాలి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని ప్రధాని సూచించారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో మహాత్మా గాంధీ స్వదేశీ ఉత్పత్తులపై ప్రజల్లో అపారమైన అవగాహన కల్పించారని గుర్తుచేశారు. కాలక్రమేణా ఖాదీకి డిమాండ్ తగ్గినా, గత 11 ఏళ్లలో మళ్లీ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మోదీ వివరించారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిలో స్వదేశీకి ప్రాధాన్యం ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరతను ఎదుర్కొంటున్న తరుణంలో భారతదేశం కూడా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. ఇందుకోసం స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని పెంపొందించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.అన్ని పార్టీలూ కలిసిరావాలి.రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనబెట్టి స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహానికి దేశవ్యాప్తంగా విప్లవాత్మకంగా సహక...

హిల్సా చేపల కోసం మత్స్యకారులకు సరికొత్త గైడ్: సముద్రంలో ఎక్కడ, ఎప్పుడు వేటకు వెళ్ళాలి?

పశ్చిమ బెంగాల్:మత్స్యకారులకు ఒక ప్రధాన సమస్య – సముద్రంలో ఎప్పుడూ ఎక్కువ చేపలు దొరుకుతాయో ముందే తెలుసుకోవడం. భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం (ఇన్కాయిస్) ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చింది. హిల్సా చేపల లభ్యత గుట్టును ఛేదించడం ద్వారా లక్షలమందికి వేట సులభం అయ్యింది. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లోని హిల్సా చేపల లభ్యతను గుర్తించేందుకు ఇన్కాయిస్ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. కేంద్రం డైరెక్టర్ టి.ఎం. బాలకృష్ణన్ నాయర్ నేతృత్వంలో హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు మరింత సులభంగా హిల్సా చేపల లభ్యతను 70-72% కచ్చితత్వంతో గుర్తించే మోడల్ను అభివృద్ధి చేశారు. ఇందులో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, లవణీయత, తరంగాల వేగం వంటి డేటాను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ తో అనుసంధానం చేశారు. దీనిపై మూడేళ్లపాటు ప్రయోగాలు జరుగాయి. తాజాగా, ఫిషరీస్ ఓషనోగ్రఫీ జ‌ర్నల్‌లో హిల్సా చేపలను గుర్తించే పరిశోధన పత్రం ప్రచురించబడింది. ఇన్కాయిస్ ఏపీ, ఒడిశా తీర ప్రాంతాల్లోనూ హిల్సా చేపల లభ్యతను గుర్తించింది. హిల్సా చేప 14–18 మీటర్ల లోతులో వేగంగా ఈదిస్తూ రోజుకు 70 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వీటి ...

అహ్మదాబాద్‌లో రేబిస్ బారినపడి సీఐ మృతి – పెంపుడు కుక్క గాటుతో విషాదం

గుజరాత్: అహ్మదాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నగర పోలీస్ కంట్రోల్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా విధులు నిర్వహిస్తున్న వన్‌రాజ్ మంజరియా రేబిస్ బారిన పడి మృతి చెందారు. వివరాల ప్రకారం, వన్‌రాజ్ మంజరియా తన నివాసంలో ఒక పెంపుడు కుక్కను పెంచుతూ వచ్చారు. ఇటీవల ఆ కుక్క ఆయన చేతిపై గీకింది. సాధారణ గాయం అని భావించిన ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లు సమాచారం. అయితే కొన్ని రోజులకే ఆరోగ్య సమస్యలు వేధించడంతో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన తర్వాత ఆయన రేబిస్ బారిన పడ్డారని నిర్ధారించారు. ఆ రోజు నుంచే చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో వన్‌రాజ్ మంజరియా చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అహ్మదాబాద్ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సహచరులు ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నారు. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, కుక్క, పిల్లి, కోతి వంటి జంతువులు కరిచినప్పుడు లేదా గీసినప్పుడు వెంటనే ఆ గాయాన్ని నీటితో బాగా కడిగి, తక్షణమే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకోవాలి. రేబిస్ బారిన పడిన తర్వాత చికిత్స ప...

PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.6,000

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ప్రధాని మాతృత్వ వందన్ యోజన' పథకం ద్వారా గర్భిణులు మొదటి ప్రసవానికి రెండు విడతల్లో రూ.5,000 ప్రసూతి ప్రయోజనం పొందవచ్చు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అదనంగా రూ.6,000 లభిస్తాయి. ఈ పథకం 19 ఏళ్లు దాటిన వివాహిత మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. మరిన్ని వివరాలకు https://pmmvy.wcd.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి, సిటిజన్ లాగిన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చు.

సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ:ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ‘సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పాక్‌ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. మొరాకో పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.