తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Anantapur Andhra Pradesh Uravakonda March 13, 2026

ఉరవకొండలో వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి విశేష పూజలు

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

ఉరవకొండ:స్థానిక డ్రైవర్స్ కాలనీలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి సహిత శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.

శనివారం మరియు ఏకాదశి కలసి వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు కావడంతో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక సేవలూ ప్రారంభమయ్యాయి.

కార్యక్రమ విశేషాలు:

 * అభిషేకాలు: స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష తిరుమంజనం నిర్వహించారు.

 * అలంకరణ: లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారిని రంగురంగుల పుష్పాలతో, తులసీ దళాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

 * అర్చనలు: భక్తుల గోత్రనామాలతో అష్టోత్తర శతనామావళి పూజలు, శాంతి హోమాలు జరిగాయి.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులుఎయిర్ టెల్ ప్రతాప్ మాట్లాడుతూ, భక్తులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరాలని, లోక కల్యాణం కోసం ఈ విశేష పూజలు నిర్వహించినట్లుఆయన తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో కాలనీ వాసులు మరియు చుట్టుపక్కల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తి సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం వైకుంఠాన్ని తలపించిందని ఎయిర్ టెల్ ప్రతాప్ పేర్కొన్నారు.