కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్లో సబర్వాల్ పేర్కొన్నారు, కమిషన్ తనపై పక్షపాతం ప్రదర్శించిందని, నివేదికలో చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు తన పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని. అలాగే, కమిషన్ తనకు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసిందని, చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు.
సమస్య పరిష్కారం కోసం, సబర్వాల్ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు అభ్యర్థించారు.
ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ధర్మాసనం ఒకటి లేదా రెండు రోజుల్లో విచారణ చేపట్టనున్నారు. ఈ కేసు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ చర్యలు, కమిషన్ నివేదిక న్యాయపరంగా సమీక్షకు అవకాశం కల్పించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment