Skip to main content

Posts

Showing posts with the label అనంతపురం జిల్లా

ఈశ్వరమ్మ దేవస్థానం పరిసరాల మురుగు దుస్థితిపై బీజేపీ నేత జోక్యం

  స్పందించని పంచాయతీ: జేసీబీతో చెత్త తొలగింపు ఉరవకొండ: అక్టోబర్ 21: ఉరవకొండ పట్టణంలోని ఈశ్వరమ్మ దేవస్థానం పరిసరాలు తీవ్ర దుస్థితికి చేరాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, మురుగునీరు, పెరిగిన కంపచెట్లు పేరుకుపోవడంతో ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. స్థానికులు పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థానిక నాయకుడుదగ్గుపాటి శ్రీరామ్ స్వయంగా రంగంలోకి దిగారు. దేవస్థానం పరిసరాల శుభ్రత కోసం జేసీబీ (JCB) యంత్రాన్ని ఏర్పాటు చేయించి, పరిసర ప్రాంతాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. చెత్తకుప్పలు, పాడైన రోడ్లు, మూసుకుపోయిన మురుగు కాలువలను ఆయన పర్యవేక్షణలో తొలగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతదగ్గుపాటి శ్రీ రామ్ మాట్లాడుతూ, "ప్రజల ఆరోగ్యం, దేవాలయ పవిత్రత కోసం ఇలాంటి చర్య తప్పనిసరి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల తరపున ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది" అని వ్యాఖ్యానించారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "...

​ట్రంప్ దిష్టిబొమ్మ దహనం: వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల పెంపునకు నిరసన

  ​ఉరవకొండ: అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం పెంచిన సుంకాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీపావళి సందర్భంగా నరకాసుర వధ స్థానంలో ట్రంప్ విధించిన సుంకాలను నిరసిస్తూ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. ​ఈ నిరసనలో భాగంగా, ఉరవకొండ మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ ఫ్లెక్సీని దహనం చేసి తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్నాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ రంగం, పాడి, ఎగుమతి చేసే ఉత్పత్తులపై 11 నుంచి 50% వరకు ట్రంప్ విధించిన సుంకాల కారణంగా దేశీయ వ్యవసాయ రంగం దివాళా తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వ్యవసాయ కార్మికులు పని దినాలు కోల్పోయి, పెద్ద ఎత్తున వలసలు పోవాల్సి వస్తుందని తెలిపారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధానాలు అవలంబిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదాన్ని కేంద్రంలో...