Skip to main content

Posts

Showing posts with the label kalyandurg

కళ్యాణ్ దుర్గం వైసీపీ కార్యకర్తల్లో గందరగోళం

త్రిమూర్తుల మధ్యలో నలిగిపోతున్న క్యాడర్ – అధిష్టానం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ఒకరికి మద్దతు ఇస్తే మరొకరికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడడంతో కార్యకర్తలు తికమకపాటుకు గురవుతున్నారు. ఎవరికి చివరికి టికెట్ దక్కుతుందో స్పష్టత లేక పార్టీ క్యాడర్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. త్రిమూర్తుల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ యుద్ధం పార్టీ బలాన్ని దెబ్బతీసేలా మారిందని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో మాజీ మంత్రి ఉషా గారికి మద్దతుగా పనిచేసిన కొందరు నాయకులు, ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్ నుంచి దూరమవుతున్నట్టుగా సమాచారం. ఎవరికి నచ్చినట్టుగా వ్యవహారాలు సాగిపోవడం వల్ల వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో త్రిమూర్తులలో ఎవరికి అదృష్టం వరిస్తుందో, ఎవరికి అధిష్టానం మోక్షం కలిగిస్తుందో వేచి చూడాల్సిందేనని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

శ్రీ వివేకానంద హైస్కూల్‌లో 'శక్తి టీమ్' అవగాహనా కార్యక్రమం

    కళ్యాణదుర్గం: విద్యార్థిని విద్యార్థులకు భద్రత, చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా కళ్యాణదుర్గంలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు అక్టోబర్ 29, బుధవారం నాడు శక్తి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి టీమ్ సభ్యులు హెడ్ కానిస్టేబుల్ కె.సి. హక్కులన్న, మహిళా కానిస్టేబుల్ స్వాతి, కానిస్టేబుల్ విద్యాధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు విద్యార్థులకు ముఖ్యంగా బాలికలకు గుడ్ టచ్ - బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, పోక్సో (POCSO) చట్టం గురించి, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్ల గురించి పూర్తిగా వివరించారు. ఉన్నత విద్య అభ్యసించే సమయంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థిని, విద్యార్థులు పేర్కొన్నారు. అధికారులు తమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, సహకరించిన ఉపాధ్యాయులకు, యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద హైస్కూల్ కరస్పాండెంట్ నరసింహ చారి, హెడ్‌మాస్టర్ విశ్వనాథ్, తిప్పే స్వామి మరియు ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.

పాలవెంకటాపురం గ్రామంలో RSS శతాబ్ది వేడుకలు ఘనంగా

కళ్యణదుర్గం:ఆంధ్రప్రదేశ్‌లోని పాలవెంకటాపురం గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల దేవాలయ ఆవరణలో, ఆ దేవాలయ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ లింగా రెడ్డి గారి ఆధ్యర్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం (RSS) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ జోనల్ ఇన్‌ఛార్జ్ శ్రీ లక్ష్మణ్ జీ ప్రత్యేకంగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం BJP ఇన్‌ఛార్జ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మూప్పురి దేవరాజు, జిల్లా కో-కన్వీనర్ పాల బండ్ల ఆంజనేయులు, సీనియర్ నాయకులు చక్కా సుబ్రమణ్యం, మండల అధ్యక్షుడు గుడిసె పాతన్న, యువమోర్చా నాయకులు శివ తేజస్ రెడ్డి, కృష్ణ, అలాగే RSS కార్యకర్తలు తరుణ్, రఘు, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, దేశ సేవ, సాంస్కృతిక విలువల పరిరక్షణలో RSS కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. కార్యక్రమం చివర్లో భగవద్గీతా పఠనం, వందేమాతరం నినాదాలతో సభ ముగిసింది.

ఒరిగిన విద్యుత్ స్తంభం - పొంచి ఉన్న ప్రమాదం

  కళ్యణదుర్గం:బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి సబ్‌స్టేషన్ నుంచి బొమ్మగానిపల్లికి వెళ్ళే 11 కేవీ విద్యుత్ లైన్ స్తంభం కాస్త రెండు నెలల క్రితం ఒక ట్రాక్టర్ ఢీకొనడంతో పక్కకు ఒరిగిపోయింది. అయితే, అది ఇంకా సరిచేయబడకపోవడం కంటే ప్రధాన రోడ్డున పక్కనే ఉండటం కారణంగా, ఎప్పుడైనా కూలి ప్రమాదం సృష్టించవచ్చు అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, వాహనదారులు, ప్రత్యేకించి పెద్ద రోడ్డు మీదుగా ప్రయాణించే ప్రజలు, ఈ స్తంభం ప్రమాదం జరగక ముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి దాన్ని సరిచేయాలని కోరుతున్నారు. స్తంభం పక్కకు ఒరిగిన దశలో ఉన్నందున, రాత్రిపూట మరింత ప్రమాదకరంగా మారవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రాణాంతక ప్రమాదానికి అవకాశం ఉన్నదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ప్రాంతంలో విద్యుత్ భద్రతపై మరోసారి ప్రశ్నలు రేపుతోంది.