Skip to main content

Posts

Showing posts with the label Hyderabad

నాట్కో అధినేత వి.సి. నన్నపనేని: సంకల్పంతో విజయం... 'బెస్ట్ బ్యాట్స్‌మెన్‌' కంటే గొప్ప ఫార్మా హీరో!

  హైదరాబాద్/గుంటూరు: సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి, అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా దిగ్గజంగా ఎదిగిన వి.సి. నన్నపనేని (నన్నపనేని వెంకయ్య చౌదరి) జీవిత ప్రయాణం నేటి యువ పారిశ్రామికవేత్తలకు, శాస్త్రవేత్తలకు ఒక గొప్ప స్ఫూర్తి. ప్రపంచ సంపన్నుల జాబితాలో (హురున్ గ్లోబల్ సంపన్నుల జాబితా ప్రకారం $1.2 బిలియన్ సంపదతో 2686వ స్థానం) నిలిచిన ఈయన, కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, తన పరిశోధనల ద్వారా దేశంలో క్యాన్సర్ మందుల తయారీలో విప్లవాన్ని తెచ్చిన ఫార్మా హీరోగా సుపరిచితులు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నాట్కో ఫార్మా (NATCO Pharma) అధినేతగా ఆయన చేసిన కృషి, సమాజ సేవ అపారమైనది. జీవిత ప్రస్థానం: గోళ్ళమూడిపాడు నుండి గ్లోబల్ శిఖరాలకు గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం లోని గోళ్ళమూడిపాడులో జన్మించిన వెంకయ్య చౌదరి, తన బాల్య విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేశారు. కావూరులో ఎస్.ఎస్.ఎల్.సి., గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో బి.ఫార్మా, ఎం.ఫార్మా పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం 1969లో అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ కాలేజీలో ఎం.ఎస్. చదువుతూనే, వ...

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి భూవిలువలు – రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో

  హైదరాబాద్‌: నగర రియల్ ఎస్టేట్ రంగంలో మరోసారి చరిత్ర సృష్టించబడింది. టీజీఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) నిర్వహించిన భూముల వేలంలో రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ భూమి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ వేలంలో ఎకరా భూమి ధర ఏకంగా రూ.177 కోట్లకు చేరింది. మొత్తం 7 ఎకరాలు 67 సెంట్ల భూమిని ప్రముఖ ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ రూ.1,357 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. టీజీఐఐసీ ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లుగా నిర్ణయించగా, పోటీదారుల మధ్య తీవ్ర బిడ్డింగ్‌ జరుగడంతో ధరలు ఆకాశాన్నంటాయి. చివరికి ఎంఎస్ఎన్ రియాలిటీ ఎకరానికి రూ.177 కోట్లు చెల్లించి భూమిని దక్కించుకుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రస్తుతం హైదరాబాదు ఐటీ హబ్‌లో అత్యంత ప్రాధాన్యత పొందిన ప్రాంతంగా మారింది. ఈ ధర దేశంలోనే అత్యంత ఖరీదైన కమర్షియల్ భూవిలువల్లో ఒకటిగా నిలిచింది. నిపుణుల వ్యాఖ్యలు: రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ డీల్‌ను "హైదరాబాద్ అభివృద్ధికి ప్రతీకాత్మక ఘట్టం"గా అభివర్ణిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.  సారాంశం: వేలం నిర్వాహకులు: టీజీఐఐసీ...

సర్పంచ్ అభ్యర్థులకు ఈటెల హెచ్చరిక.

 హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలపై సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకూడదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన సూచించారు. “తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి. ఇవి లీగల్‌గా చెల్లుబాటయ్యే ఎన్నికలు కావని జాగ్రత్తగా ఉండాలి. కోర్టు రాజ్యాంగబద్ధంగా లేవని కొట్టేస్తే పరిస్థితి ఏమవుతుంది? మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు రద్దు చేసింది. అప్పట్లో పోటీదారులు భారీగా నష్టపోయారు” అని ఈటెల గుర్తుచేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర తరహాలో ఇక్కడా ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులు హడావుడిగా ఖర్చు చేయకుండా పరిస్థితి స్పష్టంగా తెలిసే వరకు ఆగాలని ఈటెల పిలుపునిచ్చారు.

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.        బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, “ఆడబిడ్డలను మన సంతోషాల్లో భాగస్వాములను చేసినప్పుడే ఈ పండుగ నిండుదనం సంతరించుకుంటుంది” అని పేర్కొన్నారు. బతుకమ్మ కుంట కోసం జీవితాంతం పోరాడిన వి. హనుమంతరావును స్మరించుతూ ఆయనకు గౌరవప్రదమైన నివాళులు అర్పించారు. హైడ్రా ఏర్పాటు సమయంలో ఎదురైన వివాదాలు, విమర్శలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, “ఒడిదుడుకులు వచ్చినపుడు సమయస్ఫూర్తితో పరిష్కారాలు కనుగొంటూ ముందుకు సాగాలి” అని అన్నారు. కోవిడ్‌ తరువాత వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం కుంభవృష్టి వర్షాలు ఒకేసారి కురుస్తున్నాయని తెలిపారు. “మన వ్యవస్థ కేవలం రెండు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేలా ఉన్నప్పటికీ, ఇప్పుడు విపరీత వర్షాలను ఎదుర్కొనేలా పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలు సిద్ధం చేశాం” అని ముఖ్యమంత్రి వివరించారు. మూసీ పునరుజ్జీవనమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి...

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణుల స్వాధీనం

  హైదరాబాద్ : శషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి విదేశీ వన్యప్రాణుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాదుకు చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేయగా, అతని సామాను నుంచి అరుదైన వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు.అరుదైన జాతులు పట్టుబాటు కస్టమ్స్ అధికారుల ప్రకారం స్వాధీనం చేసిన వన్యప్రాణాల్లో ఒక మానిటర్ బల్లి, రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువానాలు, మొత్తం 12 ఇగువానాలు ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న అరుదైన జాతులని తెలిపారు.తిరిగి బ్యాంకాక్ తరలింపు స్వాధీనం చేసిన ఈ వన్యప్రాణులను సంబంధిత అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తిరిగి బ్యాంకాక్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం తగిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.ప్రయాణికుడు అదుపులో వన్యప్రాణాలను అక్రమంగా భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో సెక్యూరిటీ విభాగాలు అప్రమత్తమయ్యాయి.

భాగ్యనగరంలో మూసీ వరద: డ్రోన్ విజువల్స్ ద్వారా సమీక్ష

హైదరాబాద్: ఉగ్రంగా ప్రవహిస్తున్న మూసీ నది మరియు మద్యపునిట్లలో పడుతున్న వరద పరిస్థితిని డ్రోన్ల ద్వారా తీసుకున్న విజువల్స్ అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. భాగ్యనగరంలో మూసీ నది ఉగ్ర ప్రవాహంతో విస్తరిస్తోంది, జలాలు నివాస ప్రాంతాల వద్దకు చేరుతూ ప్రమాద పరిస్థితులను సృష్టిస్తున్నాయి. హిమాయత్ సాగర్ గేట్లు ఒకేసారి ఎత్తిన దృశ్యం, భారీగా ప్రవహిస్తున్న నీటిని చూపుతూ, నగరంలోని ప్రధాన వరద నియంత్రణ విధానాలను వెల్లడిస్తుంది. రక్షణ చర్యలు చేపడుతున్న అధికారులు DRF, GHMC, RTC మరియు పోలీస్ బృందాలు కలిసి, సురక్షిత ప్రాంతాలకి వందల మంది ప్రజలను తరలిస్తున్న దృశ్యాలను డ్రోన్లు ద్వారా లైవ్‌గా నమోదుచేస్తున్నాయి. ఈ డ్రోన్ విజువల్స్, ప్రజలకు వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, ప్రభుత్వ సహాయక చర్యలను గమనించడానికి ఒక కీలక సాధనంగా మారాయి.

మూసీ వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్: నగరాన్ని అతలాకుతలం చేస్తున్న మూసీ వరదల పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. కమిషనర్ చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితులను సమీక్షించారు. ముఖ్యంగా చాదర్‌ఘాట్ పరిసరాల్లో నది నీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించారు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలో ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించే చర్యలను కమిషనర్ ప్రత్యక్షంగా గమనించారు. ఎంజీబీఎస్ సమీపంలో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో నీరు లోపలికి ప్రవేశించిన ప్రాంతాలను కూడా పరిశీలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా DRF బృందాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చొరబడినప్పుడు DRF, పోలీసులు, RTC, GHMC సిబ్బంది కలసి వందలాది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఆయన అభినందించారు. మూసీ వరదల దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూ...

సోషల్ మీడియాలో దుర్వినియోగం పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున.

ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున తన పేరును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న అనుచిత కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జస్టిస్ తేజస్ కారియాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ముందు నాగార్జున తరఫున న్యాయవాది ప్రవీణ్ణానంద్ వాదనలు వినిపించారు. న్యాయవాది వాదిస్తూ—“నాగార్జున ఇప్పటివరకు 95 సినిమాల్లో నటించారు. రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడైన ఆయనను ఉగ్రవాదిగా పేర్కొంటూ కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జూదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రొమాంటిక్ సంబంధాల పేర్లు అంటగడుతున్నారు. అంతేకాకుండా, ఏఐతో తయారు చేసిన వీడియోలను యూట్యూబ్ షార్ట్స్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో నాగార్జున పేరుతో హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ సమాచారాన్ని తొలగించేలా సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలి” అని విన్నవించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, అనుచిత కంటెంట్ ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్ల...

జస్టిస్ ఘోష్ నివేదికపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో సబర్వాల్ పేర్కొన్నారు, కమిషన్ తనపై పక్షపాతం ప్రదర్శించిందని, నివేదికలో చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు తన పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని. అలాగే, కమిషన్ తనకు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసిందని, చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం, సబర్వాల్ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ధర్మాసనం ఒకటి లేదా రెండు రోజుల్లో విచారణ చేపట్టనున్నారు. ఈ కేసు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ చర్యలు, కమిషన్ నివేదిక న్యాయపరంగా సమీక్షకు అవకాశం కల్పించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం – ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు నిర్వహణలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. బుధవారం ఉదయం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం ప్రకారం, మియాపూర్ – ఎల్బీ నగర్ రూట్‌లో దూసుకెళ్తున్న మెట్రో రైలు భరత్‌నగర్ స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా ఆగిపోయింది. రైలు ఆగిపోవడంతో డబ్బాలో ప్రయాణిస్తున్న వారు భయాందోళనలకు గురయ్యారు. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు రైలు కదలకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే కొద్ది సేపటికే సమస్యను అధిగమించి రైలును మళ్లీ ప్రారంభించడంతో ప్రయాణం సాఫీగా కొనసాగింది. ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందిస్తూ, “సాంకేతిక లోపం కారణంగానే రైలు కొన్ని నిమిషాల పాటు ఆగిపోయింది. వెంటనే మా సిబ్బంది చర్యలు తీసుకోవడంతో సమస్య పరిష్కరించబడింది. ప్రయాణికులకు పెద్దగా ఇబ్బందులు కలగలేదు” అని తెలిపారు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ మెట్రోలో ఇలాంటి సాంకేతిక లోపాలు తరచూ ఎదురవుతున్నాయి. ఒక్కోసారి తలుపులు తెరుచుకోకపోవడం, ఎలక్ట్రిక్ సప్లై సమస్యలు, సాఫ్ట్‌వేర్ లోపాల కారణంగా రైళ్లు ఆగిపోవడం జరుగుతోంది. దీనితో ప్రయాణికులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు చెబుతున్న దాని ప్రకారం...

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం అమలు

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా చేయడానికి డ్రోన్ల ద్వారా పోలీసింగ్ విధానం ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచన ప్రకారం, అత్యంత ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించి వాహనదారులకు ప్రత్యక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అయితే, ఈ విధానం కోసం పోలీస్ విభాగం వెంటనే తగిన సంఖ్యలో డ్రోన్లను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. డ్రోన్ల ద్వారా వాహనాల రద్దీపై అంచనాలు వేయడం, రూట్ మార్గాలను సూచించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చర్యలు చేపట్టడం లక్ష్యంగా ఉంది. ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణలో నూతన యంత్రాంగం వేగంగా అమలు కానుందని అధికారులు తెలిపారు.

13,217 గ్రామీణ బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్!

హైదరాబాద్:ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకిం గ్,పర్సనల్ సెలక్షన్ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టు ల భర్తీకి దరఖాస్తు గడువు ఈనెల 21 తో ముగిసింది, అభ్యర్థుల కోరిక మేరకు ఐబీపీఎస్‌ ఈ నెల 28 వరకు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది. ఏపీ గ్రామీణ బ్యాంక్‌లో 152, తెలంగాణ గ్రామీణ్‌ బ్యాంక్‌లో 798 పోస్టులు ఉన్నాయి. ఐబీపీఎస్‌ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీసర్స్‌ (స్కేల్‌ 1, 2,3) ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ కొన్ని పోస్టులకు స్పెషలైజ్డ్‌ డిగ్రీ అవసరం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి సెప్టెంబర్‌ 1 నాటికి ఆఫీస్‌ అసిస్టెంట్లకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 1 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 2 పోస్టులకు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 3 పోస్టులకు 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరి మితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి...