Skip to main content

Posts

Showing posts with the label Nellore

29 పార్కులకు కబ్జా నుంచి విముక్తి

శ్రీధర్‌రెడ్డిని చాలాకాలం గుర్తుంచుకొంటారు నెల్లూరు:నగరమనే కాంక్రీట్‌ అరణ్యానికి ఊపిరితిత్తులు పార్కులే. అగ్గిపెట్టెల వంటి అపార్టుమెంట్లలో నివసించడం తప్పనిసరి అయిన రోజులలో, కాసింత గాలి పీల్చుకొనే వసతి, నాలుగడుగులు నడిచే వనరు పార్కులు మాత్రమే. అందువల్లే ఇళ్లకు లేఅవుట్‌ చేసిన ప్రతి చోటా 10 శాతం భూమి పార్కు కోసం వదలి పెట్టాలని నియమం. కానీ అదే జరగడం లేదు. ప్లాట్లు అమ్మే వరకు ఖాళీ స్థలం వుంటుంది; ఆ వెంటనే అది కూడా ప్లాట్లుగా మారిపోతుంది. గత ఇరవై ఏళ్లలో నెల్లూరు నగరంలో వేసిన రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్లు కనీసం రెండు మూడు వందలుంటాయి. అంటే నగరంలో అన్ని పార్కులు కూడా వుండాలి. కానీ అక్కడొకటి, ఇక్కడొకటి తప్ప, వాటి ఆచూకే లేదు. కారణం - కబ్జా. కొన్ని ప్లాట్లు అమ్మిన వారే స్వంతం చేసుకొంటే, మరికొన్ని స్థానికంగా భుజబలం వున్న వారు కైవసం చేసుకొన్నారు. ఈ దుర్మార్గక్రమానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టడానికి రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చిత్తశుద్ధితో కూడా ప్రయత్నం చేస్తున్నాడు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలో దాదాపు 29 పార్కులు గుర్తించి, కబ్జా కోరల నుంచి విముక్తి కల్పించి, చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు...

జనసమస్యల పరిష్కారానికి ముందడుగు – జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు

 నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసులు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.  గారి సూచనలతో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజలతో భాగస్వామ్య పద్ధతిలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల నియంత్రణ దిశగా గ్రామాల్లో గ్రామస్తులు, పెద్దలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రజలకు ఆస్తి నేరాలు, నివారణ చర్యలు, సైబర్ మోసాలు, గాంజా–ఇసుక అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే మహిళలు మరియు బాలబాలికలపై నేరాలు, చట్టాలు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో తగాదాలు, గొడవలు లేకుండా సామరస్యంగా జీవించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఇసుక, మద్యం, గంజాయి వంటి నిషేధిత వస్తువుల అక్రమ రవాణా అరికట్టడంలో గ్రామస్థులు సహకరించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టి, చెడు ప్రవర్తన కలిగిన వారిని పోలీసు అధికారులు కౌన్సిలింగ్ చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ...

ఇప్పుడు హైటెక్ సిటీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, భావితరాలు గూగుల్ గురించి అలా మాట్లాడుకుంటారు....... రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్

  - గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఎంత చెప్పినా తక్కువే .  - గూగుల్ లక్ష 35 వేల కోట్లు పెట్టుబడులు ఆంధ్రలో పెడుతుంది . నెల్లూరు :నెల్లూరు నగరంలోని హారనాథపురంలో గల తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ........ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ మన నవ్యాంధ్ర ప్రదేశ్ కు రావటం అత్యంత సంతోషకరమని అన్నారు. అందరం కలిసికట్టుగా దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. గూగుల్ ఆంధ్రకు వచ్చిందని గర్వపడాల్సింది పోయి వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కి రావటంతో ప్రపంచం మొత్తం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతుందని అన్నారు. అక్కడక్కడ వర్షానికి నీరు వచ్చి ఆగినా, వైసిపి నాయకులు దానిని టిడిపి తప్పిదమని చెప్పే పనిలో ఉన్నారని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కు రావటం చంద్రబాబుకు లోకేష్ కు ఐటి రంగంలో ఉన్న అనుభవానికి నిదర్శనమని అన్నారు. దాదాపు కోటి ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్తు గూగుల్ డేటా సెంటర్కు అవసరమని ఆ విద...

దివ్యాంగ విద్యార్థులకు విపిఆర్‌ దంపతుల చేయూత

నెల్లూరు:నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మరోసారి తమ మానవతా మనసును చాటుకున్నారు. "మాట ఇస్తే తప్పకుండా అండగా నిలుస్తాం" అని చెప్పినట్టుగానే, ఉత్తమ ప్రతిభ చూపిన దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయాణానికి ఆర్థిక సహాయం అందించారు. గురువారం విపిఆర్‌ నివాసంలో జరిగిన కార్యక్రమంలో విద్యా స్వరూపిణికి రూ.1.30 లక్షలు, సిరివల్లికి రూ.1.25 లక్షలు, భవాని పూజితకు రూ.30 వేల రూపాయలు ఫీజుల నిమిత్తం అందజేశారు. ఈ మొత్తాలను విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయంగా అందజేసి, విద్యార్థులను ఆశీర్వదించారు. గత జూన్ 9న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “షైనింగ్‌ స్టార్స్‌ అవార్డ్స్” కార్యక్రమంలో నెల్లూరు, పొదలకూరు భవిత కేంద్రాల్లో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఈ ముగ్గురు విద్యార్థులు అవార్డులు అందుకున్నారు. ఆ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఈ విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. దంపతులు చిన్నారులను ఆశీర్వద...