Skip to main content

Posts

Showing posts with the label Ananantapur (Dist )

బకాయిల చెల్లింపుపై సీపీఎం వినతి

 . ఉరవకొండ మండలంలో పెండింగ్‌లో ఉన్న రూ. 33 లక్షలకు పైగా నిధులు 40 రోజులుగా 'వెండర్ ఖాతా'లోనే నిధులు; లబ్ధిదారులకు అందని మొత్తం సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు స్పందించాలని సీపీఎం డిమాండ్‌  ఉరవకొండ మండలంలో వివిధ పథకాల కింద రైతులకు, ప్రజలకు రావాల్సిన రూ. 33.98 లక్షల రూపాయల బకాయిలను వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాలని సీపీఎం పార్టీ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-మార్కిస్టు) మండల నాయకత్వం ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) గారిని కోరింది. నిధులు విడుదలై 40 రోజులు గడిచినా, ఇంకా 'వెండర్ అకౌంట్'లోనే నిలిచిపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా సీపీఎం నాయకులు ఎన్. మధుసూధనన్ నాయుడు కె. సిద్దప్ప కలిసి ఎంపీడీవోకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.  పెండింగ్‌లో ఉన్న బకాయిల వివరాలు ప్రభుత్వం గత 40 రోజుల క్రితమే 'వెండర్ అకౌంట్'లోకి జమ చేసినప్పటికీ, కస్టమర్ల (లబ్ధిదారుల) ఖాతాలకు జమ చేయకుండా పెండింగ్‌లో ఉన్న నిధుల వివరాలను సీపీఎం నాయకులు ఈ విధంగా వివరించారు:  ఉద్యాన పంటల బకాయిలు (డీఆర్‌డీఏ ద్వారా): రూ. 66,38,68/-   హౌసింగ్ మరియు వాటర్ ...

అనంతపురం జిల్లా పేరు జాతీయ స్థాయిలో రాణించాలి.

  -తైక్వాండో విజేతలకు ఎమ్మెల్యే దగ్గుపాటి పిలుపు *-బెంగళూరులో జరిగే పోటీల్లో రాణించాలన్న ఎమ్మెల్యే* ఉరవకొండ మన జన ప్రగతి అక్టోబర్ 27: అనంతపురం పేరు జాతీయ స్థాయిలో వినిపించాలని తైక్వాండో విజేతలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 42వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి జూనియర్ తైక్వాండో పోటీల్లో అనంతపురం వాసులు గెలుపొందారు. విజయనగరం జిల్లాలో జరిగిన పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటిని కలవగా.. వారిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో అనంతపురం పేరు వినిపించేలా చేశారన్నారు. ఇప్పుడు బెంగళూరులో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో కూడా పతకాలు సాధించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ కు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని.. తల్లిందడ్రులు తమ పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు.

సమాచారం ఇవ్వని గుత్తి తాసిల్దార్, గుంతకల్ ఆర్డీవోలపై చర్యలు తీసుకోండి.

  ఉరవకొండ  అక్టోబర్ 19: గుత్తి మండలం: పుల్లేటి ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ భూ సమాచారం, అక్రమ మ్యూటేషన్ గురించి అడిగిన సమాచారాన్ని గుత్తి తాసిల్దార్ ఇవ్వలేదు. దీంతో అప్పీలు అధికారి అయిన గుంతకల్ ఆర్డీవోను ఆశ్రయించగా ఆయన సమాచారం అందించలేదు. నిర్ణీత గడువు 30 రోజుల్లోగా సమాచారాన్ని సెక్షన్ 7(1 )కింద ఇవ్వకపోతే ఉల్లంఘనే. ఉల్లంఘనా చర్యల్లో భాగంగా సెక్షన్ 20(1) ప్రకారం ఆలస్యానికి గాను బాధ్యత వహించి రోజుకు ₹250 చొప్పున జరిమానా చెల్లించాలని ఆర్ టి ఐ యాక్ట్ లోని సెక్షన్ 20 (2) చెబుతోంది. ఇదే క్రమంలో  అప్పీలు అధికారి ఆర్డీవో సమాచారం ఇప్పించడంలో వైఫల్యం చెందారు. సేవా నిబంధనల ప్రకారం ఆయన కూడా శాఖాపరమైన చర్యలకు బాధ్యులే. అధికారులు ఇద్దరు ఇద్దరే. సమాచారం ఇవ్వని, ఇప్పించని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారుడు/ ఆప్పీలు దారుడు మాలపాటి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సమాచారం ఇవ్వని అధికారులు: రెండవ అప్పీల్‌కు దరఖాస్తు సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పౌర సమాచార అధికారి (PIO), అప్పీలు అధికారి (AA) నుంచి సమాచారం...