అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కొత్త హెచ్-1బీ వీసా ఫీజు దేశీయ ఐటీ మరియు నైపుణ్యం కలిగిన ఉద్యోగులలో తీవ్ర ఆందోళన సృష్టించింది. ఈ నెల 21 నుండి అమల్లోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు విధించబడింది. ఈ ఫీజు ఒక ఏడాది పాటు అమలులో ఉంటుంది. తరువాత, అమెరికా చట్టసభ (కాంగ్రెస్స్) చట్టం చేస్తే, పూర్తిస్థాయి అమలు జరుగుతుంది. మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే ఉద్యోగుల వార్షిక వేతనం సగటు 60,000–140,000 డాలర్ల మధ్య ఉండటంతో, కంపెనీలకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించడం సవాలుగా మారింది. అయితే, జాతీయ ప్రాధాన్యం ఉన్న రంగాల్లో, అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం మినహాయింపులు ఉండవచ్చని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. సెక్షన్ 1 (సి) ప్రకారం, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ఈ మినహాయింపులపై అధికారం వినియోగించవచ్చు. మినహాయింపులు పొందే రంగాలు: ఫిజీషియన్లు వైద్య మరియు ఆరోగ్య పరిశోధనలు రక్షణ, జాతీయ భద్రత స్టెమ్ కార్యకలాపాలు ఇంధనం విమానయానం సైబర్ సెక్యూరిటీ అత్యంత నైపుణ్యం కలిగిన ఈ రంగాల ఉద్యోగులు లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపులు పొందే అవకాశం ఉన్నందున,...