కరూర్ (తమిళనాడు): సినీనటుడు, తమిళగమన పార్టీ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా కరూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విజయ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ – “నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.”
Local to international