Skip to main content

Posts

Showing posts with the label Ananantapu

అనంతపురంలో కౌలు రైతుల మహా ధర్నా: నూతన చట్టం, రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌

అనంతపురం: తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం (ఏపీ కౌలు రైతు సంఘం) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ కౌలు రైతులకు వెంటనే నెరవేర్చాలని, వారికి పూర్తి స్థాయి గుర్తింపు కల్పించాలని సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు ఇవే కౌలు రైతులు ప్రధానంగా ఆరు అంశాలను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిని తక్షణమే అమలు చేయాలని సంఘం నేతలు స్పష్టం చేశారు.  CCRC కార్డులు: క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డులు (CCRC) మంజూరు చేసే ప్రక్రియలో భూ యజమాని సంతకం నిబంధనను తొలగించాలి. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు కార్డులు జారీ చేయాలి.   E-క్రాఫ్ట్ నమోదు: సాగు చేస్తున్న కౌలు రైతులందరినీ ఈ-క్రాఫ్ట్ కింద నమోదు చేసి, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించాలి.   నూతన చట్టం: కౌలు రైతుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా నూతన కౌలు చట్టాన్ని రూపొందించాలి.   ఎక్స్‌గ్రేషియా: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రభుత్వమే రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్ల...

అనంతపురం రాంనగర్ హెచ్డీఎఫ్‌సీ బ్యాంకులో బంగారం మాయం కలకలం

  అనంతపురం రాంనగర్‌లోని హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున బంగారం మాయం ఘటన చోటు చేసుకుంది. మొత్తం 37 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు 2 కిలోల బంగారం అదృశ్యమైనట్లు సమాచారం. బ్యాంకులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ బంగారాన్ని అక్రమంగా కాజేసి, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు బుధవారం బ్యాంకు ముందు ధర్నా చేపట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రజల సొమ్మును రక్షించాల్సిన బ్యాంక్‌లోనే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఉరవకొండను ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చి దిద్దాలి.-రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు మొలక రామాంజనేయులు.

అనంతపురం జిల్లా, ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు శ్రీ మొలక బాల రామాంజనేయులు పంచాయతీ కార్యదర్శికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా రామాంజనేయులు మాట్లాడు తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. తద్వారా ఉరవకొండను ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీ పరిధిలో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయని శ్రీ మొలక బాల రామాంజనేయులు ఆరోపించారు. ముఖ్యంగా ఈ : సాధారణ దుకాణాలు.  హోటళ్లు : ఆహార విక్రయ సంస్థలు. కిరాణా షాపులు: నిత్యావసర వస్తువుల దుకాణాలుమాంసం అమ్మే దుకాణాలు నిషేధాన్ని ఉల్లంఘిస్తూ విక్రయాలు సాగిస్తున్నాయని ఆయన ఫిర్యాదులో స్పష్టం చేశారు నిబంధనల ఉల్లంఘనపై మాత్రమే కాకుండా, ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలన్నారు ప్లాస్టిక్ రహిత పంచాయతీ లక్ష్యాన్ని సాధించడం ద్వారా స్థానిక పర్యావరణ కాలుష్యాన్ని, ముఖ్యంగా మురుగునీటి వ్యవస్థలో ప్ల...

ఉరవకొండ ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోండి: ఏవీఎస్ హెచ్చరిక

నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల దోపిడీ, కండిషన్ లేని బస్సులపై ఆంధ్ర విద్యార్థి సంఘం ఆగ్రహం ఉరవకొండ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయని ఆంధ్ర విద్యార్థి సంఘం (ఏవీఎస్) తీవ్రంగా మండిపడింది. అక్రమ ఫీజుల వసూళ్లు, ప్రమాదకరమైన బస్సుల నిర్వహణ, అర్హత లేని ఉపాధ్యాయుల బోధన వంటి అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం నాడు జరిగిన పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) లో ఏవీఎస్ నేతలు ఈ మేరకు సమగ్ర ఫిర్యాదు సమర్పించారు.  జీవోలను లెక్కచేయని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 1,, 52,, 53 లకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ నిబంధనలను పాటించకుండా మిస్టర్ రాజ్యాంగ ఫీజులు (అధిక మొత్తంలో ఫీజులు) వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయని ఏవీఎస్ నాయకులు ఆరోపించారు.  విద్యార్థుల భద్రతకు ముప్పు: బస్సులు, డ్రైవర్ల లోపం విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ పాఠశాలలు చలగాటమాడుతున్నాయి అని ఏవీఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.   బస్సులు: గ్రామీణ ప్ర...

అనంతపురం జిల్లా టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేష్ సీరియస్..

2 రోజులపాటు అనంతపురంలో పర్యటించిన నారా లోకేష్.. తన పర్యటనలో పార్టీ నేతల వ్యవహారంపై మంత్రి లోకేష్ అసహనం. కార్యకర్తలకు అండగా ఉండని కొందరు ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి.. పార్టీ మీటింగ్ లో ద్వితీయశ్రేణి నేతలకు నారా లోకేష్ దిశానిర్దేశం. అలిగి ఇంట్లో కూర్చుంటే మాకెలా తెలుస్తుందని ప్రశ్నించిన లోకేష్. నిత్యం కార్యకర్తలతో మాట్లాడుతూ.. అసంతృప్తి ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తేవాలి. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని ఎమ్మెల్యేలు కలుపుకొని పోవాలి : మంత్రి నారా లోకేష్

ఘనంగా గజ గౌరీ అమ్మవారి నిమజ్జనం

  బొమ్మనహల్ మండలం, : బొమ్మనహల్ మండలంలోని ఉద్దేహాల్, ఉంతకల్లు, శ్రీధరఘట్టతో పాటు పలు గ్రామాలలో శుక్రవారం శ్రీ గజ గౌరీ అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఊరేగింపులో ఉత్సాహం:  అమ్మవారి నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై, జాజిపూలు, కొబ్బరికాయలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. డప్పుల మోగింపు, సాంస్కృతిక వాతావరణంతో గ్రామాలు జాతరను తలపించాయి, సందడిగా మారాయి. పురుషులు, యువతులు, బాలబాలికలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ వీధుల గుండా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి, అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థన: గజ గౌరీ అమ్మవారి పూజలతో గ్రామంలో శాంతి, సౌభాగ్యం కలగాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. పూజల అనంతరం మహిళలు పరస్పరం తాంబూలాలు పంచుకున్నారు. ఈ వేడుకతో గ్రామమంతా పండుగ శోభతో కళకళలాడింది.

క్యాన్సర్ పై విజయం - స్క్రీనింగ్ తో సాధ్యం :

   ఉరవకొండ :  వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శుక్రవారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమం మండల వైద్యాధికారి డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్య అధికారులు మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి ఉచితంగా నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పిస్తుంది ఈ పరీక్షలు చేయించుకోవడానికి మీ ఇంటి వద్దకు వచ్చే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. మీ సమీపంలోని ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన అవసరం లేదు ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగల వ్యాధి ఇది ఈ వ...