Skip to main content

Posts

Showing posts with the label Tirumala

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

  తిరుమల, 2025 అక్టోబర్ 20: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది.  ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు.  ఇందులో భాగంగా, శ్రీ మలయప్పస్వామి,శ్రీ-భూ అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పార మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలను అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు.   నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు మరియు దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తి అయినది.  అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు.

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి హుండీ ఆదాయం ₹25.12 కోట్లు

తిరుమల. ట్రూ టైమ్స్ ఇండియా శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినట్లు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలకు తితిదే ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు

తిరుమలలో సూర్యప్రభ వాహనసేవ వైభవం.

  తిరుమల : సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు, శ్రీ మలయప్ప స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవ ఆరంభం కాగానే భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో కీర్తనలు చేస్తూ ఉత్సవానికి శోభను చేకూర్చాయి. మంగళవాయిద్యాల గోల నడుమ వాహనం ముందుకు కదిలే సమయంలో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆరోగ్యప్రదాత సూర్యప్రభ వాహనం సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు. చంద్రుడుకూడా సూర్యుని తేజస్సుతోనే ప్రకాశిస్తాడని ఆధ్యాత్మికులు వివరిస్తున్నారు. ఈ వాహనసేవలో శ్రీమన్నారాయణుడే సూర్యప్రభ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ వాహనంలో దర్శనం లభిస్తే భోగభాగ్యాలు, సత్సంతానం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. చంద్రప్రభ వాహనసేవ రాత్రి మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు అనుగ్రహించనున్నారు. ఈ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ తద...

తిరుమలలో చరిత్ర సృష్టించిన గరుడ సేవ: 2.35 లక్షల భక్తులతో అశేష జనవాహిని!

 తిరుమల:    సెప్టెంబర్ 28: కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి పారవశ్యంతో పతాక స్థాయికి చేరాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన, ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ ఈ రోజు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు జరిగే ఈ సేవకు భక్తులు పోటెత్తడంతో తిరుమల గిరులు అశేష జనవాహినితో నిండిపోయాయి. నిర్ణీత సమయం కంటే ముందే గరుడ సేవ ప్రారంభం భక్తుల రద్దీని, వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సాధారణంగా రాత్రివేళ జరిగే గరుడ సేవను ఈ ఏడాది ఆలయ అధికారులు ముందుగానే ప్రారంభించారు. నిర్ణీత సమయం కంటే ముందే, సరిగ్గా ఉదయం 6:07 గంటలకే శ్రీవారి మూలవిరాట్ తరహాలో అలంకరించబడిన ఉత్సవ మూర్తిని అంగరంగ వైభవంగా గరుడునిపై అధిరోహింపజేశారు. శ్రీనివాసుడు తన జన్మదిన నక్షత్రమైన స్వాతి నక్షత్రానికి అధిపతి, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడుని (వేదాలలో విష్ణువు వాహనంగా పేర్కొనబడిన పక్షిరాజు) అధిరోహించి భక్తులకు దర్శనం ఇచ్చారు. తిరుమాడ వీధుల్లో కమనీయ దృశ్యం శ్రీవారి గరుడ వాహన సేవ తిరుమాడ వీధుల్లో వైభవంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వా...