Skip to main content

Posts

Showing posts with the label Annamayya Dist

తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ ఉద్యోగులపై సిట్ కొరడా!

  తిరుపతి తిరుపతి: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ (SIT) విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ సిట్ కోర్టులో మెమో దాఖలు చేసింది.   నిందితుల్లో ఏడుగురు టీటీడీ ఉద్యోగులే: కొత్తగా చేర్చిన 11 మంది నిందితుల్లో ఏడుగురు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులే కావడం గమనార్హం.   కొనుగోలు విభాగంపై గురి: 2019 నుంచి 2024 మధ్య టీటీడీ కొనుగోలు (Purchase) విభాగంలో పనిచేసిన ఉన్నతాధికారులపై, కింది స్థాయి సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.  ఎవరెవరిపై కేసు నమోదు:    జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి, మురళీకృష్ణలపై కేసు.     వీరితో పాటు సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లపై కూడా కేసు నమోదైంది.    ఎస్వీ గోశాల పూర్వ డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డిపైనా సిట్ కేసు నమోదు చేసింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీలో అంతర్గతంగా జరిగిన అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. మరికొందరు అధికారులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది..

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలికి అపూర్వ సన్మానం: తిరుపతిలో ఘనంగా అభినందన సభ:దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్:

   భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర మహిళా మోర్చా నూతన అధ్యక్షురాలిగా శ్రీమతి నిషిద రాజు నియమితులైన సందర్భంగా, ఆమెకు అభినందనలు తెలిపేందుకు తిరుపతిలోని శ్రీ బాలాజీ కళ్యాణ మండపంలో 12-11-2025 తేదీన ఆత్మీయ సభను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వేలాది మంది మహిళా కార్యకర్తలు ఈ సభకు భారీగా తరలివచ్చారు.  ముఖ్య అతిథులుగా రాష్ట్ర, కేంద్ర నాయకులు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు హాజరై శ్రీమతి నిషిద రాజు కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ , కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజా శ్రీనివాస వర్మ , శ్రీ సోమువీర్రాజు , శ్రీ పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. మహిళా మోర్చా నాయకులలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బొల్లిన నిర్మల , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సాలగ్రామం లక్ష్మీ ప్రసన్న , శ్రీమతి ముళ్ళపూడి రేణుక శ్రీమతి గీత కూడా సభకు హాజరై నూతన అధ్యక్షురాలికి అభినందనలు తెలిపారు.  మహిళా రిజర్వేషన్లు, సంస్థాగత ఎన్నికలపై ప్రసంగం ఈ సందర్భంగా, మహిళా నాయకులు మాట్లాడుతూ... చట్టసభల్లో మహిళలకు 33% రి...