రాయదుర్గం నియోజకవర్గంలో ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్–కాలేజ్ బస్సులు రవాణా నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో, విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం పెరుగుతోందని ఏఐవైఎఫ్–ఏఐఎస్ఎఫ్ విద్యార్థి–యువజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, అధికారులకు వినతిపత్రం అందజేశారు. విదేశాలలో దాదాపు వినియోగం తగ్గిపోయిన డబుల్ డెక్కర్ బస్సులు మనదేశంలో మాత్రమే నడుస్తుండటం ప్రమాదకరమని నాయకులు పేర్కొన్నారు. ఇటువంటి బస్సులను రవాణా సేవల నుండి పూర్తిగా తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా, అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కిస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్, కాలేజ్ బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, సేఫ్టీ గ్రిల్ లేకుండా బస్సులను నడపడం, ఫిట్నెస్ లేకుండా రోడ్డుపై వాహనాలను వదలడం వంటి అంశాలు విద్యార్థుల భద్రతకు తీవ్రమైన ముప్పని నాయకులు తెలిపారు. వృద్ధ డ్రైవర్లను కొనసాగించడం, అనుభవం లేని డ్రైవర్ల చేతిలో బాధ్యతలు పెట్టడం కూడా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కోట్రెష్ , ఏఐ...
Local to international