Skip to main content

Posts

Showing posts with the label saluru

విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలి – మంత్రి సంధ్యారాణి ఆదేశాలు

సాలూరు: జాండీస్‌, మలేరియాతో బాధపడుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె శనివారం స్వయంగా సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మొత్తం 21 మంది విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అందరికీ అవసరమైన వైద్య సదుపాయాలు అందించాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. “విద్యార్థులు పూర్తిగా కోలుకునేంతవరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి. ఒక్క విద్యార్థి ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదు,” అని ఆమె స్పష్టం చేశారు. సాలూరు పరిసర ప్రాంతాల్లోని పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) డాక్టర్లు సమ్మెలో ఉన్న కారణంగా, అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది విద్యార్థులు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం రోగుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, అక్కడి వైద్య సిబ్బందికి మంత్రి సంధ్యారాణి ప్రత్యేక సూచనలు చేశారు. ఆమె వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, “సిబ్బంది కొరత ఉన్నా కూడా విద్యార్థుల వైద్యం విషయంలో ఎటువంటి ...

షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్‌ పర్సన్ ను కలిసిన వైకాపా నేతలు .

  సాలూరు: జాతీయ షెడ్యూల్డు తెగల చైర్ పర్సన్ అంతర్ సింగ్ ఆర్యను రాష్ట్రానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అరకు, తిరుపతి ఎంపిలు డాక్టర్ తనూజా రాణి, డాక్టర్ మద్దెల గురుమూర్తిల ఆధ్వర్యంలో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందటం, వంద మందికి పైగా విద్యార్థినిలు ఆసుపత్రిలో చేరటం తదితర అంశాలపై వినతి పత్రాన్ని అందజేసారు.  కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, నిరుపేద గిరిజన కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించ లేదని, కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదని పిర్యాదు చేశారు. చైర్ పర్సన్ ను కలిసిన వారిలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణిలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు మాజీ ఎంపీ జి. మాధవి, జిసిసి మాజీ చైర్పర్సన్, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ స్వాతీ రాణి, పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్...

మంత్రి తీరుపై సాలూరు గిరిజన నాయకులు మండిపాటు బాధలు చెప్పేందుకు వస్తే అరెస్టులు చేయిస్తారా అంటూ ప్రశ్న

సాలూరు :-రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తీరు అన్యాయంగా ఉందని, తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజన నిరుద్యోగులను అరెస్టులు చేయించటం దారుణమని ఆదివాసీ గిరిజన నాయకులన్నారు. జిల్లా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కొండగొర్రె ఉదయ్ తో పాటు సాలూరు మండల ఏజేఏసీ ప్రెసిడెంట్ నిమ్మక అన్నారావు, మండల జనరల్ సెక్రటరీ సుర్ల ప్రవీణ్, ఆదివాసీ వికాస పరిషత్ ట్రెజరర్ మచ్చ భీమారావు తదితరులు ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. శనివారం సాలూరు జరిగిన గిరిజన నిరుద్యోగుల అరెస్టులు అన్యాయమన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శనివారం ఉదయం పాడేరు, అరకు ప్రాంతాల నుండి కొంతమంది గిరిజన నిరుద్యోగులు మంత్రి సంధ్యారాణిని కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు రాగా వారిని తన ఇంటికి రానివ్వ కుండా చుట్టూ పోలీసులను కాపలా పెట్టారని, అంతేకాకుండా అరెస్టులు చేయించారన్నారు. సంధ్యారాణి గారు ఎన్నికల ముందు నేను మీ గిరిజన ఆడపడుచుని నాకు ఓటు వేసి గెలిపించండి అని కోరారని, అధికారంలోకి వచ్చాక పట్టించు కోవడం లేదన్నారు. తమ బాధలు, అన్యాయాన్ని వివరించే వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వస్తే అరెస్టులు చే...