Skip to main content

Posts

Showing posts with the label Maharashtra

వైద్య పరీక్ష విషయంలో వివాదం...* *ఆస్పత్రిలో డాక్టర్ ఆత్మహత్య...*

 *మహారాష్ట్ర అక్టోబర్ 24 మహారాష్ట్ర సతారా జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు సంపద ముండే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. వైద్య పరీక్షల విషయంలో పోలీసులతో వాగ్వాదం జరగడంతో ఆమెపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన వైద్యురాలు, సీనియర్ అధికారిని కలసి విచారణ ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అన్నట్టుగానే చివరికి గురువారం రాత్రి ఆస్పత్రిలోనే ఆమె సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యల త్యాగం.. ఇద్దరు భర్తల ప్రాణాలకు ఊపిరి

మహారాష్ట్రలోని నవీ ముంబైలో భార్యల త్యాగం మరొకసారి మానవత్వాన్ని మేల్కొలిపింది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్యులు లివర్ మార్పిడి తప్ప ఇతర మార్గం లేదని తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల్లో ఎవరి అవయవాలు సరిపోలలేదు. ఈ క్లిష్ట సమయంలో భార్యలు అద్భుత నిర్ణయం తీసుకున్నారు. ఒకరి భర్తకు మరోకరి లివర్ భాగాన్ని దానం చేయడం ద్వారా ఇద్దరి ప్రాణాలను రక్షించారు. వైద్యులు ఈ అరుదైన క్రాస్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి వర్గాలు ఈ ఘటనను "త్యాగానికి ప్రతీక"గా అభివర్ణించాయి. సమాజంలో తల్లితనాన్ని గొప్పదనంగా గుర్తించినప్పటికీ, భార్య ప్రేమలోని త్యాగం కూడా అంతే విశిష్టమని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. స్థానికులు, స్నేహితులు మాత్రమే కాకుండా వైద్యులు కూడా భార్యల ధైర్యాన్ని కొనియాడారు. "భర్త ప్రాణాల కోసం ప్రాణభాగాన్ని ఇచ్చిన వీర మహిళలు సమాజానికి ఆదర్శం" అని పలువురు ప్రశంసించారు. ఈ సంఘటన, కుటుంబ బంధాలలోని ఆత్మీయతను, సతీమణుల నిస్వార్థ ప్రేమను మరోసారి వెలుగులోకి తెచ్చింది.