Skip to main content

వైద్య సిబ్బంది తీరుపై సిపిఎం ధర్నా: రోగుల పట్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం


 ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట భారీ ధర్నా జరిగింది. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్నప్పటికీ, వైద్యులు రోగుల పట్ల అనుసరిస్తున్న తీరుపై సిపిఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"వైద్యుల దగ్గరికి వస్తే సగం జబ్బు నయం కావాలని అంటారు. కానీ ఇక్కడి వైద్య సిబ్బంది తీరు చూస్తే ఉన్న జబ్బు మాట దేవుడెరుగు, లేని జబ్బు తగిలించుకొని పోయే విధంగా ఉంది" అని సిపిఎం నాయకులు విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల జ్వరంతో బాధపడుతున్న ఐదు సంవత్సరాల చిన్నారి మరణించిన ఘటనను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రైవేట్ క్లినిక్ లపై శ్రద్ధ: ప్రభుత్వ వైద్యంపై నిర్లక్ష్యం

ప్రభుత్వ వైద్యులు తమ సొంత ప్రైవేట్ క్లినిక్ లపై చూపే శ్రద్ధ ప్రభుత్వ వైద్యం అందించే దానిపై లేదని సిపిఎం ఆరోపించింది. ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే వెంటనే అనంతపురం జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసే అధికారులు, చిన్నారి మరణం విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇక్కడి వైద్యులు రోగులను చేయి పట్టుకుని స్టెతస్కోపుతో పరీక్షించిన సందర్భాలు లేవని, కేవలం జ్వరం వచ్చిందంటే మాత్రలు మాత్రమే ఇస్తారని విమర్శించారు. రోగిని స్వయంగా చేయి పట్టుకుని చూసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.

సిపిఎం డిమాండ్స్:

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పలు డిమాండ్లను చేసింది:

 * వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని తొలగించాలి.

 * ఇప్పటినుంచైనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలి.

 * డాక్టర్లందరూ అందుబాటులో ఉండాలి.

ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మధుసూదన్, ప్రాంతీయ కార్యదర్శి రంగారెడ్డి, రైతు సంఘం నాయకులు సీనప్ప, సిద్ధప్ప, రవికుమార్, రామాంజనేయులు, కౌలు రైతు సంఘం నాయకులు వెంకటేశులు, సుంకన్న, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...