Skip to main content

రోడ్ల మరమ్మతులు గాలికి: నిత్యం ప్రమాదాల బారిన వాహనదారులు

 ట్రూ టైమ్స్  ఇండియాసెప్టెంబర్ 30


గుత్తి/అనంతపురం: గుత్తి-గుంతకల్లు రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని, కూటమి ప్రభుత్వం వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఐటీ జిల్లా అధ్యక్షుడు వై. రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మరమ్మతులు చేయకుంటే త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గుత్తి పట్టణంలో మంగళవారం వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

గుంతల రోడ్ల వల్ల ప్రమాదాలు

"గుత్తి పట్టణంలో గుంతల రోడ్ల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. చినుకు పడితే వాహనదారుల్లో వణుకు మొదలవుతుంది" అని రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో 'గుంతలు లేని రహదారులు' నిర్మిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడం దారుణమన్నారు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

బ్రిడ్జిల నిర్మాణం, శాశ్వత మరమ్మతులపై డిమాండ్

గుత్తి-గుంతకల్లు మధ్యనున్న శ్రీపురం, రజాపురం, మార్నేపల్లి, గొల్లలదొడ్డి, ధన్చర్ల, తిమ్మాపురం వద్ద బ్రిడ్జిలు నిర్మించాలని గతంలో పలుమార్లు కోరినా పనులు ప్రారంభం కాలేదన్నారు. అలాగే, పత్తికొండ రోడ్డులో గుంతలు పెరిగిపోయాయని, బసినేపల్లి వద్ద గుంతలకు వేస్తున్న తాత్కాలిక మరమ్మతులు కేవలం నెల రోజులకే తిరిగి పాడవుతున్నాయని ఆయన వివరించారు.

నెల రోజుల్లో మరమ్మతులు చేయాలి

నెల రోజులలోపు రోడ్ల మరమ్మతులు చేపట్టకపోతే, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి, ప్రభుత్వాన్ని నిలదీస్తామని రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ వరదరాజులు, ఐటీ విభాగం నాయకులు జ్ఞానేశ్వర్ రెడ్డి, అరుణ్ కుమార్, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...