_వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఆవిష్కరణ

Malapati
0
ఉరవకొండ:విడపనకల్ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురిఅవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం ఆవిష్కరించిన డిజిటల్ బుక్,క్యూఆర్ కోడ్ కార్యక్రమాన్ని ఉరవకొండ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్,మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి,రాష్ట్ర యువనేత వై.ప్రణయ్ రెడ్డి ఆదేశాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ కరపత్రాలను,క్యూఆర్ కోడ్ లను ప్రారంభించడం జరిగింది.    

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు,దాడులు జరిగితే వాటి ఫొటోలు,దాడి జరిగిన సంఘటనలు డిజిటల్‌ బుక్‌లో అప్‌లోడ్‌ చేసి లోకేషన్‌ షేర్‌ చేయాలని సూచించారు.అనంతరం డిజిటల్‌ బుక్‌ యాప్‌ పోస్టరును విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పాల్గొన్నారు._

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!