Skip to main content

బి.పెడ్ 3, 4 సెమిస్టర్ పరీక్షలను తక్షణమే నిర్వహించాలంటూ AIYF డిమాండ్

 

అనంతపురం:

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 2024–2026 బి.పెడ్ (B.P.Ed) రెండవ సంవత్సరం 3వ, 4వ సెమిస్టర్ పరీక్షలను తక్షణమే నిర్వహించాలంటూ అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) అనంతపురం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు.

AIYF అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొట్రేష్ మాట్లాడుతూ, SKU పరిధిలో ఉన్న విద్యార్థులు పరీక్షలు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2024–26 బ్యాచ్ విద్యార్థులు డీఎస్సీ (DSC) అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇప్పటికే ఆదికవి నన్నయ, విక్రమసింహపురి యూనివర్సిటీలు పరీక్ష తేదీలను ప్రకటించగా, SKU మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి షెడ్యూల్ ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు.

విద్యార్థులు SKU అధికారులను సంప్రదించాలంటే కళాశాల ప్రిన్సిపాల్ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. “విద్యార్థులు ఏదైనా ప్రశ్నిస్తే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తామని, పరీక్షలు ఆలస్యం అవుతాయని ప్రిన్సిపాల్ భయపెడుతున్నారు,” అని కొట్రేష్ తెలిపారు.

ఈ పరిస్థితుల వల్ల కొంతమంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటనలు కూడా జరిగాయని అన్నారు.

SKU యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని, వెంటనే 3, 4 సెమిస్టర్ పరీక్షలను నిర్వహించకపోతే జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో AIYF జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు దేవ, నాయకులు సురేంద్ర, మహేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...