Skip to main content

రాష్ట్రంలో డీ అడిక్షన్ కేంద్రాలు - రూ.33.80 కోట్లతో ప్రతిపాదనలు*

అమరావతి:ట్రూ టైమ్స్ ఇండియా


ప్రస్తుత సమాజంలో పెద్దల నుంచి చిన్నారుల వరకు సిగరెట్లు, గంజాయి మత్తు, మద్యానికి బానిసలవుతున్నారు. యువత హాష్‌ ఆయిల్, మత్తు ఇంజక్షన్లు, డ్రగ్స్‌ అలవాటుపడుతున్నారు. ఇలాంటి వారిని మత్తుకు దూరంగా ఉంచే ప్రయత్నంలో కొంతమంది తీవ్ర ఆవేశానికి గురవుతున్నారు. అంతర్లీనంగా ఏర్పడిన మానసిక పరిస్థితులతో తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి కోసం కూటమి ప్రభుత్వం వ్యసన విమోచన కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.


కూటమి ప్రభుత్వం కృషి: ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యసన విమోచన కేంద్రాల బలోపేతానికి రూ.33.80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జిల్లా, బోధనాసుపత్రుల్లో గల 21 కేంద్రాల్లో వైద్యపరికరాలు, మందులు, మౌళిక సదుపాయాల కల్పన, సాంకేతిక వ్యవస్థను మెరుగుపరచడం, సిబ్బందికి ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. 21 కేంద్రాల ద్వారా వ్యసనాల బారిన పడినవారిని ఆ వ్యసనాల నుంచి బయటకు తెచ్చి సన్మార్గంలో నడిచే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.


యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, చెడు సహవాసాలు చేయవద్దని, ఆరోగ్య సంరక్షణ, విలువలు ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విమోచన కేంద్రాల ద్వారా వ్యసనాలకు గురైనవారికి నిపుణుల ద్వారా చికిత్స, ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం వ్యసనాలకు గురైనవారికి కొత్త జీవితం ప్రసాదించడమేనని తెలిపారు. 2023-24లో 18147 మంది ఇన్-పేషెంట్లు ఉండగా 2024 నుంచి సెప్టెంబర్ 2025 నాటికి 22909 మంది ఇన్-పేషెంట్లు ఈ కేంద్రాల ద్వారా సేవలు పొందారని గుర్తు చేశారు.


చంద్రబాబుకు కలెక్టర్‌ వినతి: అదే విధంగా విశాఖపట్నంలో మత్తుకు బానిసైన వారి సంఖ్య పెరగడంతో డి-అడిక్షన్ సెంటర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. 4 సెంటర్లను అదనంగా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును విశాఖ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ కోరారు. కేంద్ర కారాగార సామర్థ్యం 950 మంది ఉండగా, గంజాయి కేసుల్లో వచ్చే ఖైదీలతో 2,000 మందితో జైలు నిండిపోయింది. గంజాయి కేసుల్లో వస్తున్న ఖైదీల్లోనూ యువత ఎక్కువగా ఉన్నట్లు హోంమంత్రి అనిత ఇటీవల వెల్లడించారు. కేంద్ర కారాగారం ఆధునికీకరణ నేపథ్యంలో ఇక్కడ ఒక డి-అడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. చిన్న వయసులో మత్తుకు అలవాటు పడితే వెంటనే తల్లిదండ్రులు గుర్తించి కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లాలని, ఒంటరిగా వదిలిపెట్టకూడదని మానసిక వైద్యులు అంటున్నారు. వెంటనే డి-అడిక్షన్‌ కేంద్రానికి తీసుకురావాలని సూచిస్తున్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...