Skip to main content

రుణ పరిమితి, గ్యారెంటీ పరిమితి మూడు సంవత్సరాల వరకే.

 

- సందేహాస్పద ఆస్తి వసూళ్లు సాధ్యమా?

- లిమిటేషన్ యాక్టివ్ ఉల్లంఘన.

- సుప్రీంకోర్టు రూలింగ్ పూర్తిగా విల్లంఘన.

- గ్యారెంటీ దారుని హక్కుల భంగం.

 ఉరవకొండ, ట్రూ టైమ్స్ ఇండియా:


: బ్యాంకులో తీసుకున్న రుణ కాలపరిమితి మూడు సంవత్సరాలు. అలాగే జామీను పరిమితి సైత0మూడు సంవత్సరాల వరకే. రుణ గ్రహీత తీసుకున్న నాటి నుంచి ఇప్పటివరకు ఓ వ్యక్తి గత 11 సంవత్సరాలుగా బకాయిలు చెల్లించలేదు. దీంతో బ్యాంకర్ జామీను దారున్ని తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. 

 తీసుకొన్న బ్యాంక్ రుణాన్ని మూడు సంవత్సరాల్లో గా వసూలు చేసుకోవాలి. రుణకాల పరిమితి ముగిస్తే, జామీనుదారు కాల పరిమితి ముగిసినట్లే అని సుప్రీంకోర్టు రూలింగ్ స్పష్టంగా తెలియపరిచింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు లిమిటెడ్ వర్సెస్ సిడికో లెదర్స్ కంపెనీ లిమిటెడ్ 2014లో ఇచ్చిన రూలింగ్ లో గ్యారెంటీ దారుని పరిమితి మూడు సంవత్సరాల వరకే అలాగే 12 సంవత్సరాల వరకు కాదని స్పష్టికరించింది.


వివరాలు ఇలా ఉన్నాయి: ఉరవకొండ సిండికేట్ బ్యాంక్, ప్రస్తుతం కెనరా బ్యాంకు గా కొనసాగుతోంది. శ్రీ హనుమాన్ ఎంటర్ప్రైజెస్ ప్రోప్రైటర్ మేకల కృష్ణవేణి, మేకల సుబ్బు దంపతులు తేదీ17-07-2014 నాడు షాపు ప్రారంభోత్సవానికి రూ 1,9900/లు రుణం పొందారు. ఈ రుణంలో బ్యాంకర్ తన వద్ద రూ 50లు వేలు డిపాజిట్ చేయించుకొని మిగతా రూ 1,49,000 లు షాపు యజమానులకు అందించారు. 


ఈ రుణానికి మాలపాటి శ్రీనివాసులు అనే వ్యక్తి జామీను దారుగా వ్యవహరించారు. కొన్ని వాయిదాలు చెల్లించారు. ఈ క్రమంలో షాపు అగ్ని ప్రమాదానికి గురై మిగతా కంతులు కట్టలేని స్థితిలో రుణగ్రహీతలు చేతులెత్తారు.

 సాధారణంగా రుణకంతులు వరుసగా మూడుసార్లు చెల్లించకపోయినట్లయితే ఆ ఆస్తిని మొండి అప్పుగా భావిస్తారు.. రుణగ్రహీతను బ్యాంకర్ ఒత్తిళ్లు తేలేదు. బ్యాంకర్ మొత్తం దృష్టి గ్యారెంటీ దారుడు మాలపాటి శ్రీనివాసులపై ఉంచారు. అతను బ్యాంకులో ఉంచిన డిపాజిట్ లపై కన్నేశారు. జామీ న్ దారునికి రుణ బకాయిలు ఉన్న సంగతులు ఏనాడు తెలపలేదు.

 రుణ గ్రహీత కు రూ 10 లక్షల పైగా విలువచేసే సొంత ఇల్లు ఉంది. ఆ దిశగా బ్యాంకర్ చర్యలు చేపట్టలేదు.

2014లో తీసుకున్న రుణం 20 25 ఇప్పటివరకు చెల్లించలేదు. అప్పును రెన్యువల్ చేయించలేదు, గ్యారెంటీ దారుడు రెన్యువల్ చేయించలేదు. గ్యారెంటీ దారుడు రెన్యువల్ చేయకపోతే, గ్యారెంటీ దారుడు ఒకవేళ అప్పు పత్రాలలో జామీను సంతకాలు రెన్యువల్ చేయకపోతే జామీను దారునికి ఏ మాత్రం సంబంధం ఉండదు.

 సకాలంలో గ్యారెంటీ దారుడు పునరుద్ధరణ చేయలేదు. దీంతో గ్యారెంటీ దారుని కాలపరిమితి ముగిసినట్లే.

 1963 లిమిటేషన్ ఆక్ట్ ఉల్లంఘన : 1963 లిమిటేషన్ యాక్ట్ ప్రకారం నిర్ణీత సమయంలో గా గ్యారెంటీ దారుడు పునరుద్ధరించకపోతే, అతనికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడానికి బ్యాంకరుకు వీలు లేదని సుస్పష్టంగా చెబుతుంది.

నిర్దిష్ట కాలపరిమితి : రుణం గడువులోగా రాబట్టుకోవాలి. నిర్ణీత గడువు మూడు సంవత్సరాలు. మూడు సంవత్సరాలు గడువు ముగుస్తుందని బ్యాంకర్ ఒకవేళ భావిస్తే స్పందించి రుణ గ్రహీత మరియు జామీను దారుల దృష్టికి తీసుకెళ్లి రుణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి.. నిర్ణీతగా సమయం మూడు సంవత్సరాలు ముగిసింది. 2014 నుంచి 2017 కు ముగుస్తుంది 2017లో రెన్యువల్ చేయించలేదు. 2017 నుంచి 2020 మరో సారి రెన్యువల్ చేయించలేదు 20 20నుంచి 2023 వరకు రెన్యువల్ చేయించలేదు. సుమారు 11 సంవత్సరాలు పైబడింది.

ఇన్నేళ్లు మొద్దు నిద్రలో ఉన్న బ్యాంకర్లు గాఢ నిద్ర నుంచి ఉలిక్కిపడి కాల పరిమితి ముగిసిందని రుణ బకాయి కోసం యత్నాలు చేస్తున్నారు, గ్యారెంటీ దారునిపై చర్యలు తీసుకోవటానికి వీలు లేదు. సరి కదా రుణ గ్రహీత కృష్ణవేణి దంపతులు ఉరవకొండ లోని సొంత ఇల్లును అమ్ముకొని సొమ్ము చేసుకుని పామిడి మండలం కత్రిమలలో ఉంటూ మాగాని పొలం కొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ 1992 కేసులో సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. గ్యారెంటీ దారుని కాలపరిమితి మూడు సంవత్సరాలే. కాల పరిమితి ముగిస్తే అంతే సంగతులని సుప్రీంకోర్టు రూలింగ్ లో తేల్చి చెప్పింది.

 ఇది ఇలా ఉండగా ఐ సి ఐ సి ఐ బ్యాంకు లిమిటెడ్ వర్సెస్ సిడికో లెదర్స్ లిమిటెడ్ 2014 కేసులో సైతo గ్యారెంటీ దారుని కాల పరిమితి మూడు సంవత్సరాల వరకే, 12 సంవత్సరాల వరకు కాదని స్పష్టికరించింది.


 నియమం ఏమిటంటే : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమం ప్రకారం బకాయి వడ్డీ మరియు అసలు రుణం 90 రోజులకు పైగా ఉంటే దానిని మొండి అప్పుగా పరిగణిస్తారు. అదే 12 నెలల వరకు చెల్లించని పక్షంలో సబ్ స్టాండర్డ్ ఆసక్తిగా అవుతుంది. 12 నెలలు దాటితే సందేహాస్పద ఆస్తిగా మారుతుంది. బ్యాంకు ఎన్పీఏ ని పాక్షికంగా లేదా పూర్తిగా రద్దు చేయలేనప్పుడు రెండవది జరుగుతుంది. ఇది రికవరీ విలువను కలిగి ఉన్నప్పటికీ అది బ్యాంకింగ్ ఆస్తిగా కొనసాగడానికి సేకరించలేనిదిగా మరియు తక్కువ విలువగా పరిగణించబడుతోంది.

 

నష్ట ఆస్తులు: నిరర్థక ఆస్తులను వ్రాయలేనప్పుడు నష్ట ఆస్తులు సంభవిస్తాయి. అటువంటి ఆస్తి కొంత పునరుద్ధరణ విలువ కలిగి ఉన్నప్పటికీ అది సేకరించలేనిదిగా పరిగణించబడుతుంది. మరియు బ్యాంకింగ్ ఆస్తిగా కొనసాగడానికి చాలా తక్కువ విలువ కలిగి ఉంటుంది.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...