Skip to main content

ఉచిత విద్యా వైద్యం కోసం ఉద్యమించాలి డక్కా కుమార్ రాష్ట కార్యదర్శి.


ఉరవకొండ అక్టోబర్ 16:


 ఉరవకొండ విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య AIFDS ప్రథమ జిల్లా మహాసభ ఉరవకొండ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డక్క కుమార్ హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వందల మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు హాజరయ్యారు.


 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి సమస్యలపై ఏఐఎఫ్డిస్ఐ విద్యార్థి సంఘం స్వార్ధంగా పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. ఇందులో భాగంగా గతంలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కోసం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కోసం అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహించామన్నారు. ఇటువంటి పోరాట ఫలితంగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందయన్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో బిజెపి ప్రభుత్వం విద్య కాషాయీకరణం చేపట్టిందని దాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వాలు కట్టుకున్నాయన్నారు. అదే విదంగా పీపీపీ పేరుతో ప్రవేటికరణ ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యా దూరం అవుతుంది అన్నారు. అదేవిదంగా విద్యార్థి సమస్యలను పరిష్కరించేందుకు కాకుండా ఈ రాష్ట ప్రభుత్వం దొంగ జీవోలు ఇచ్చి ఈరోజు విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలను వెళ్ళనివ్వకుండా విద్యార్థి సమస్యలు తెలుసుకోకుండా విద్యార్థుల సమస్యలు చెప్పుకోకుండా చేస్తున్నారన్నారు. కేంద్రంలోని ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ యంత్రం మీద దాడి చేసి రాజ్యాంగం మౌలిక సూత్రమైన బావ బకటన స్వేచ్ఛను అరిస్తున్నారన్నారు. ఆ జీవోను వెనక్కి తీసుకోకపోతే దీనిమీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. బిజెపి ప్రభుత్వం చేస్తున్న విద్య కాషాయీకరణ కుట్రను అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిస్ అధ్యక్ష కార్యదర్శులు నందు,సిద్దు,జిల్లా నాయుకులు తరుణ్, మధు, కుళ్లాస్వామి,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...