ఉరవకొండ : నాయుడు" అనే బిరుదు చరిత్రలో మొదటగా కమ్మ వర్గానికి, ఆ తర్వాత వెలమ వర్గానికి మాత్రమే వర్తించిందని ఉరవకొండ ట్రూ టైమ్స్ విశ్లేషణలో వెల్లడైంది. ఈ పిలుపు కమ్మవారి రాచరిక గుర్తింపుగా వందల ఏళ్లుగా కొనసాగిందని చరిత్ర ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని పత్రిక పేర్కొంది.
కమ్మ రాజుల చరిత్రలో నాయుడు
13వ శతాబ్దంలోనే ముసునూరి కమ్మ రాజులు వారి వంశస్తులు నాయకుడు అనే బిరుదు నుండి "నాయుడు"గా పిలవబడ్డారని చరిత్రకారులు చెబుతున్నారు. వీరి పాలనా ప్రాంతం వరంగల్, భద్రాచలం, రేఖపల్లి వరకు విస్తరించి ఉంది.
ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు పాలించిన ముఖ్యమైన కమ్మ రాజవంశాల పేర్లలో కూడా "నాయుడు" అనే పిలుపు ప్రధానంగా ఉంది. వీరిలో పెమ్మసాని, సాయపనేని, సూర్యదేవర, వాసిరెడ్డి, రావెళ్ళ వంటి కమ్మ రాజులు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు దాదాపు 200 నుండి 300 ఏళ్లు పరిపాలించారు.
కాకతీయ గణపతి దేవుడి బావమరిది పేరు జయప్పనాయుడు.
ప్రతాపరుద్రుడి దుర్గ పాలకుడు, మంత్రి పేరు గన్నమనాయుడు.
రుద్రమదేవి అంగరక్షకుల పేర్లు కూడా నాయుడు అని శాసనాల్లో కనిపిస్తున్నాయి.
నాయుడు అనే బిరుదు కమ్మవారి రాచరికపు పిలుపుగా స్థిరపడక ముందు, "వర్మ" అనే పిలుపు కూడా వాడబడింది, కానీ "నాయుడు" బిరుదే ఎక్కువ ప్రాచుర్యం పొందింది.
చౌదరి బిరుదు
కమ్మవారికి చౌదరి అనే బిరుదు 16-17 శతాబ్దాల కాలంలో నిజాములచే రాజసంగా ఇవ్వబడింది. అయితే, చౌదరి కంటే నాయుడు బిరుదే కమ్మవారికి వందల సంవత్సరాల క్రితం నుండి రాచరికపు పిలుపుగా కొనసాగుతూ వచ్చిందని ట్రూ టైమ్స్ వివరించింది.
చరిత్ర కోల్పోయే ప్రమాదం
నాయుడు అనే అసలు రాజస పదాన్ని కమ్మవారు మర్చిపోయి, వివిధ రకాల పేర్లతో పిలవబడుతున్నందున, వేరే వర్గాల వారు ఈ పేరును కబ్జా చేసే పరిస్థితికి వచ్చారని పత్రిక ఆందోళన వ్యక్తం చేసింది. మరో 100 సంవత్సరాల తర్వాత, గొప్పగా పాలించిన ఈ కమ్మ రాజుల చరిత్రను వేరే వర్గాలు తమదిగా చెప్పుకునే ప్రమాదం ఉందని, ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని పత్రిక హెచ్చరించింది.
కొనసాగించాలని విజ్ఞప్తి
చరిత్రను, వారసత్వాన్ని కాపాడటం కోసం, ఏ ప్రాంతవాసులైన కమ్మవారైనా తమ పిల్లలకు నాయుడు పేరును కొనసాగించాలని, కమ్మవారి రాచ పేరు అయిన నాయుడును మళ్లీ వినియోగించాలని పత్రిక విజ్ఞప్తి చేసింది.

Comments
Post a Comment