Skip to main content

ఉరవకొండలో 'ఇన్‌ఛార్జి' పాలనపై ప్రజాగ్రహం!

 

ఇదేనా సుపరిపాలన?

ఉరవకొండ, అక్టోబర్ 26: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవస్థానాల పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. కీలక స్థానాల్లో అధికారుల కొరత, ఇన్‌ఛార్జి పాలన, మరియు బాధ్యతారహిత ప్రవర్తనతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొనడంపై 'ఇదేనా సుపరిపాలన?' అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

 పోలీసు, రెవెన్యూ శాఖల్లో ఇన్‌ఛార్జిల రాజ్యం

ఉరవకొండలో పాలనా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. కీలక శాఖలలో పరిస్థితి దారుణంగా ఉంది.

  పోలీస్ శాఖ: ఉరవకొండ గ్రామీణ సర్కిల్ అధికారి (సీఐ) పదవి గత మూడు నెలలుగా ఖాళీగా ఉంది. అంతేకాకుండా, గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ సైతం లేరు. కేవలం ఇన్‌ఛార్జి పాలనతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదు.దొంగతనాలు,పేకాట జూదాలు, ఊరూరా బెల్టు దుకాణలతో పోలీస్ నియంత్రణ కష్టతరమైంది.

  రెవెన్యూ కార్యాలయం: ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాసిల్దార్ కూడేరుకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు తీసుకుని, కేవలం చుట్టపుచూపుగా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. క్యాంపులు, ముఖ్యమంత్రి/ప్రధానమంత్రి పర్యటనల ముసుగులో ఆయన ఇక్కడా, అక్కడా సేవలు అందిస్తూ, వేలాది రూపాయల జీతాలు పొందుతున్నా... పాలన మాత్రం లోపభూయిష్టంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 ఎంపీడీవో కార్యాలయం: ఎంపీడీవో సైతం వేళాపాళా లేకుండా విధులకు హాజరవుతున్నారు. తరచూ సెలవుల్లో ఉండటం లేదా 'క్యాంపు' ముసుగులో చెక్కర్లు కొడుతుండటంతో పనులు ఆలస్యమవుతున్నాయి.

 గ్రామ పంచాయతీ: మేజర్ గ్రామ పంచాయతీలో శానిటరీ పోస్టు ఖాళీగా ఉన్నా, నియమించిన దాఖలాలు లేవు.

 దేవస్థానాలలో అస్తవ్యస్తమైన పాలన

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లోనూ పరిపాలన పరిస్థితి భిన్నంగా లేదు.

 గవిమఠం సంస్థానం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన గవిమఠంలో సహాయ కమిషనర్ (ఏసీ) బదిలీపై వెళ్లి ఆరు నెలలు కావస్తున్నా, ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. అర్హత లేని ఓ గ్రూప్ టెంపుల్ అధికారిని మేనేజర్‌గా కొనసాగిస్తున్నారు.

 పెన్నహోబిలం దేవస్థానం: పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం దేవస్థానం ఈవో రమేష్ బాబు ఆరోపణల నేపథ్యంలో సెలవుపై వెళ్లారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయకపోవడంతో, అనంతపురం ఎండోమెంట్ ఏసీ తిరుమల్ రెడ్డి ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇన్‌ఛార్జి పాలన కారణంగా భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నూతన రథ నిర్మాణానికి నిధులు, అనుమతులు పెద్ద అడ్డంకిగా మారాయి.

 


మంత్రి అందుబాటులో లేకపోవడంతో ప్రజల వేదన

ఉరవకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆయన సోదరులు స్థానికంగా అందుబాటులో లేకపోవడం ప్రజలకు మరింత కష్టంగా మారింది. తమ సమస్యలను విన్నవించుకోవాలంటే స్థానికంగా కలిసే అవకాశం లేక, అనంతపురం వెళ్లి, చోటామోటా నాయకులు/కార్యకర్తల ద్వారా సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంత జరుగుతున్నా, అధికారులు ప్రజా ప్రతినిధుల ఎదుట నక్క వినయాలు ప్రదర్శిస్తూ, ముఖస్తుతి చేస్తున్నారని; వారి వెనకాల మాత్రం మరోలా వ్యవహరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

లబ్ధిదారులు, ఉరవకొండ ప్రజలు స్పందిస్తూ... మంత్రివర్యులు తమ నియోజకవర్గంలో నెలకొన్న ఈ ఇన్‌ఛార్జిల పాలన సమస్యను గుర్తించి, తక్షణమే స్పందించి, సుపరిపాలన అందించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...