Skip to main content

ఉరవకొండలో భగ్గుమన్న జర్నలిస్టుల వర్గపోరు

 

- కొత్త యూనియన్‌ ఆవిర్భావం

-పాత నాయకులపై ' మద్యం దుకాణ దారుల తో అక్రమ వసూళ్ల' ఆరోపణలు, -నియంతృత్వ పోకడలపై అసంతృప్తి

ఉరవకొండ, అక్టోబర్ 13 

ఉరవకొండలో జర్నలిస్టుల సంఘంలో నెలకొన్న అంతర్గత విభేదాలు చిలికిచిలికి గాలివానగా మారి, పట్టణంలో మరో కొత్త జర్నలిస్టు యూనియన్ ఏర్పాటుకు దారితీశాయి. పాత యూనియన్ నాయకత్వంపై స్వలాభం కోసం మద్యం దుకాణ దారులతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు, నియంతృత్వ పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కొందరు పాత్రికేయులు ఆదివారం ఏకమై ప్రత్యేక యూనియన్‌ను ప్రకటించారు.

అసంతృప్తికి కారణాలు:

ఉరవకొండలో ఇప్పటికే ఉన్న జర్నలిస్ట్ యూనియన్ నేతలు విలేకరుల సమస్యలు, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. యూనియన్ ముసుగులోమద్యం దుకాణ దారులతో అక్రమ వసూళ్లకు పాల్పడి, ఆ మొత్తాన్ని తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, రెండు, మూడు అక్షరాల దినపత్రికలకు చెందిన కొందరు నాయకులు అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరి, నియంతృత్వ ధోరణులతో విసిగిపోయిన పాత్రికేయులు ప్రత్యేక యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

పాత నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు:

గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇద్దరు పాత్రికేయుల హవా కొనసాగిందని, వీరు అందరినీ కలుపుకుపోతామని చెప్పి, కేవలం స్వప్రయోజనాల కోసం యూనియన్ ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అసంతృప్తి పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన యూనియన్ జవాబుదారీతనంతో, అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందని అసమ్మతి వర్గం ప్రకటించింది.

సమాచారం అందకుండా యూనియన్ ఏర్పాటుపై విమర్శలు:

కొందరు పాత్రికేయులు హుటాహుటిన సమాచార హక్కు చట్టం అమలు దినోత్సవం రోజున కొత్త యూనియన్‌ను ఏర్పాటు చేయడం హర్షణీయమే అయినప్పటికీ, ఈ విషయాన్ని మొత్తం పాత్రికేయులందరికీ సమాచారం అందించకుండా మొక్కుబడిగా ఏర్పాటు చేశారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉరవకొండలో నేటితో రెండు జర్నలిస్ట్ యూనియన్లు అధికారికంగా ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. కొందరికి సమాచారం ఇవ్వకుండా రెండో యూనియన్ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరికొందరు పాత్రికేయులు మూడో యూనియన్ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.



వృత్తి విలువలే ముఖ్యం:

ఏది ఏమైనప్పటికీ, ప్రజా సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించాల్సిన బాధ్యత విలేకర్లదేనని, ఆ వృత్తి విలువలను కాపాడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేవలం ప్రకటనలు, చిన్న మొత్తాల కోసం వ్యక్తిగత పబ్లిసిటీని పెంచుకునే నేతల చర్యలు జర్నలిజం పవిత్రతను దిగజార్చుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. పాత్రికేయ సంఘాలు విలేకరుల సంక్షేమం కోసం, వృత్తి విలువలను పెంపొందించే విధంగా వ్యవహరించాలని, యూనియన్ ముసుగులో స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడితే అది వృత్తికి తీరని నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మద్యం దుకాణ దారులతో అక్రమ వసూళ్లపై విచారణకు డిమాండ్:

కొంతమంది విలేకరులు పాత యూనియన్ నాయకులు పాల్పడిన అక్రమ వసూళ్లపై విచారణ జరిపి, నిజమని తేలితే ఆ యూనియన్‌ను రద్దు చేసి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...