Skip to main content

ఇప్పుడు హైటెక్ సిటీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, భావితరాలు గూగుల్ గురించి అలా మాట్లాడుకుంటారు....... రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్

 


- గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఎంత చెప్పినా తక్కువే

- గూగుల్ లక్ష 35 వేల కోట్లు పెట్టుబడులు ఆంధ్రలో పెడుతుంది.

నెల్లూరు :నెల్లూరు నగరంలోని హారనాథపురంలో గల తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ........ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ మన నవ్యాంధ్ర ప్రదేశ్ కు రావటం అత్యంత సంతోషకరమని అన్నారు. అందరం కలిసికట్టుగా దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. గూగుల్ ఆంధ్రకు వచ్చిందని గర్వపడాల్సింది పోయి వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కి రావటంతో ప్రపంచం మొత్తం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతుందని అన్నారు. అక్కడక్కడ వర్షానికి నీరు వచ్చి ఆగినా, వైసిపి నాయకులు దానిని టిడిపి తప్పిదమని చెప్పే పనిలో ఉన్నారని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కు రావటం చంద్రబాబుకు లోకేష్ కు ఐటి రంగంలో ఉన్న అనుభవానికి నిదర్శనమని అన్నారు. దాదాపు కోటి ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్తు గూగుల్ డేటా సెంటర్కు అవసరమని ఆ విద్యుత్తు ఇచ్చేందుకు ఆంధ్ర రాష్ట్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఆదా నీ డేటా సెంటర్ వారు పోర్టుతో కలిపి 15000 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారని గూగుల్ లక్ష 35 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయంటే ప్రభుత్వంపై ఉండే నమ్మకమని అన్నారు. పరిశ్రమలు వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. గూగుల్ డేటా సెంటర్తో వైజాగ్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి ఒక హబ్ గా మారనుందని అన్నారు. డేటా సెంటర్ ఆంధ్రకు రావటం వైసిపి నాయకుడు విమర్శలు చేసినంత సులభం కాదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వ ఉండబోతుందని పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉంటుందని నమ్మి నిర్ధారించుకుని గూగుల్ పెట్టుబడులు పెడుతుందని అన్నారు. పక్క రాష్ట్రాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్నాయని మనం రాయితీలు ఇచ్చి పరిశ్రమలను ఆకర్షించాలని అన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదని ఎప్పటికో కడతారన్న భావన ఉండేదని చంద్రబాబు వచ్చాక ఆ భావన పోయిందని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో రాజకీయ నాయకుల పిచ్చికూతలు ఎవరూ నమ్మవద్దని, చంద్రబాబు లోకేష్ల జీవితంలో ఇది ఒక మైలు రాయిలా నిలవబోతుందని అన్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో భావితరాలు గూగుల్ గురించి మాట్లాడుకుంటాయని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...