కరూర్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన దారుణ తొక్కిసలాట ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు.
ఖుష్బూ మాట్లాడుతూ, “ఈ ఘటన యాదృచ్ఛికం కాదు... పక్కా ప్రణాళికతో కావాలనే సృష్టించినట్లు కనిపిస్తోంది,” అంటూ తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు.
తొక్కిసలాటలో జరిగిన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, దీనికి ఎవరో కావాలనే కారణమై ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. విజయ్ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వకపోవడాన్ని ఖుష్బూ తీవ్రంగా విమర్శించారు.
“41 మంది ప్రాణాలు పోయాయి... కానీ సీఎం స్టాలిన్ మాత్రం మౌనం వహిస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడాలి. ర్యాలీలో పోలీసులు లాఠీ ఛార్జ్ ఎందుకు చేశారు?” అని ప్రశ్నించారు.
దీనికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయని, వాటి ఆధారంగా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇక కరూర్లో జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేపట్టింది.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment