Skip to main content

రాయలసీమ లాయర్ల ఐక్యతకు పిలుపు: కర్నూలులో హైకోర్టు/బెంచ్ సాధనకు కీలక పోరాటం.


 అధికారమనేది నీటి మీద బుగ్గ.

రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, న్యాయవాద వృత్తి విస్తరణకు అత్యంత కీలకమైన ఆంధ్ర హైకోర్టు ప్రధాన బెంచ్ (లేదా హైకోర్టు)ను కర్నూలులో సాధించేందుకు స్థానిక న్యాయవాదుల మధ్య ఐక్యత అవసరమని ప్రముఖ న్యాయవాద వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రాపకంలో వ్యక్తిగత లబ్ధి కంటే, ప్రాంతీయ ప్రయోజనాలే ముఖ్యమని, హైకోర్టు స్థాపనతో వేలాది మంది న్యాయవాదులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నాయి.

రాజకీయ నియామకాలపై ఆగ్రహం:

రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొద్దిమంది లాయర్లకు (సుమారు 10 మందికి) తాత్కాలిక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పోస్టులు ఇవ్వడం మినహా, రాయలసీమకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే హైకోర్టు ఏర్పాటుకు చిత్తశుద్ధి చూపడం లేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం అనేది నీటి మీద బుగ్గ లాంటిది" అని పేర్కొంటూ, రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

కర్నూలు అభివృద్ధికి హైకోర్టు కీలకం:

రాయలసీమ ప్రాంత కేంద్రమైన కర్నూలులో ఆంధ్ర హైకోర్టు లేదా శాశ్వత బెంచ్ ఏర్పాటైతే ప్రాంతం కొంతైనా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా న్యాయ ప్రాక్టీస్ చేసే వారికి భారీ స్థాయిలో పని దొరుకుతుందని వారు అభిప్రాయపడ్డారు. కేవలం పది మంది లాయర్ల ప్రయోజనం కంటే, యావత్ ప్రాంత న్యాయవాదులకు, ప్రజలకు న్యాయ సదుపాయాలు దగ్గరై, అభివృద్ధికి అవకాశం దొరికే హైకోర్టు ఏర్పాటుకు కృషి చేయడమే మంచిదని నొక్కి చెప్పారు.

హామీలు.. ఆచరణ శూన్యం:

గత ప్రభుత్వాల హామీలు, తీర్మానాలు ఆచరణకు నోచుకోలేదని లాయర్లు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం న్యాయ రాజధానిని ఏర్పాటు చేయలేదన్న విమర్శలు ఉండగా, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా, కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల హామీ ఇచ్చి, 2025 డిసెంబరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆచరణలో పెట్టలేదని మండిపడుతున్నారు.

అడగనిదే అమ్మ కూడా అన్నం పెట్టదు:

దాదాపు రెండేళ్ల పాలనా కాలం సమీపిస్తున్నా, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఎలాంటి గట్టి చర్యలు తీసుకోకపోవడం పాలకవర్గాల చిత్తశుద్ధికి నిదర్శనమని లాయర్లు విమర్శించారు. అడగనిదే, పోరాటం చేయనిదే, ఒత్తిడి తీసుకురానంత వరకు ఏ పాలకవర్గ పార్టీ కూడా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయదనేది 'నగ్న సత్యం' అని వారు పేర్కొన్నారు.


ఐక్యతతో పోరాడాలని పిలుపు:

ఈ నేపథ్యంలో, కర్నూలు బార్ లాయర్లు తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, 16-11-1937 శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తితో కర్నూలులో ప్రధాన హైకోర్టు లేదా కనీసం హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఐక్యంగా పోరాడాలని తీర్మానించారు.

కర్నూలు బార్ అసోసియేషన్ పిలుపు:

 కర్నూలు బార్ అసోసియేషన్ ఇచ్చిన తీర్మానం మేరకు మూడు రోజుల పాటు కోర్టు విధులను పూర్తిగా బహిష్కరించడానికి మద్దతు తెలపాలి.

  భారత ప్రధాని కర్నూలు పర్యటన సందర్భంగా, నేడు రేపు కర్నూలు బార్ అసోసియేషన్ చేపట్టబోయే ఆందోళనకు ప్రతి ఒక్క కర్నూలు న్యాయవాది మద్దతు తెలిపి, తమ వంతు కనీస బాధ్యతగా సంపూర్ణ సంఘీభావం తెలపాలని కోరారు.

న్యాయవాదులందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యమై, రాయలసీమ ప్రజల ప్రయోజనం కోసం ఈ చారిత్రక పోరాటంలో భాగస్వాములు కావాలి.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...