Nov 27, 2025,
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం కుండపోత వర్షాలతో అతలాకుతలమైంది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం స్తంభించింది. బురద, శిథిలాలు గ్రామాల గుండా ప్రవహించి విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 17 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు, మరో ఆరుగురు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments
Post a Comment