Skip to main content

నవంబర్ 2025 నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ 2025 1న (నేడు) పంపిణీ....

 



 నవంబర్ 2025 నెలకు సంబంధించిన 2,81,298 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 125.39 కోట్ల రూపాయలు పంపిణీకి సర్వం సిద్ధం: జిల్లా కలెక్టర్ శ్రీ ఓ.ఆనంద్

 ఉరవకొండ మన జన ప్రగతి నవంబర్ 30:

 అనంతపురము, నవంబర్ 30: నవంబర్ 2025 నెలకు సంబంధించిన 2,81,298 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 125.39 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ 01 వ తేదీ న లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం అని జిల్లా కలెక్టర్ శ్రీ ఓ.ఆనంద్, ఐ.ఏ.ఎస్ తెలిపారు. 


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు డిసెంబర్ 1వ తారీఖున పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6.30 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశిస్తూ డిఎల్డిఓలను, ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. 


జిల్లా కలెక్టర్ అధికారులకు టెలికాన్ఫరెన్స్ లో సూచిస్తూ నవంబర్ మాసం పెన్షన్లను డిసెంబర్ 1 వ తారీఖున పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ మొత్తాన్ని ఈ నెల నవంబర్ 29 నాడే సంబంధిత అధికారులు డ్రా చేసి సేఫ్ కస్టడీ లో ఉంచుకొన్న మొత్తాన్ని, డిసెంబర్ 1 వ తారీఖున సిబ్బంది అందరూ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేయుట కొరకు వారి పంపిణి ప్రదేశాలకి చేరుకొని ఉదయం 6.30 గం లకు యాప్ ఓపెన్ అయ్యాక పింఛను దారులకు పింఛన్లు పంపిణి చేపట్టాలని సూచించారు.


డిసెంబర్ 1 వ తేదీన ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ పింఛనుదారుల ఇంటివద్దనే పింఛను ఇవ్వాలని, పింఛనుదారు ఇంటి నుండి ఖచ్చితంగా 300 మీటర్ల పరిది దాటితే పని చేయదని, ఏ కారణం చేతనైనా ఇంటివద్ద ఇవ్వడం కుదరకపోతే తగిన కారణాలను యాప్ నందు నమోదు చేయవలయునని తెలియచేసారు. పింఛను దారులకు ముందుగా నమస్కారం పెట్టి గౌరవంగా చిరునవ్వు తో పింఛను పంపిణీ చేయవలయునని ఆదేశించారు. ఏ కారణం చేతనైనా పింఛను తీసుకోని లబ్ధిదారులకు వారి యొక్క చరవాణి కి సందేశం పంపబడుతుంది. వీరికి 02.12 .2025 తేదీ మధ్యాహ్నం 02.00 గం.ల నుండి 05.00 గం.ల వరకు గ్రామ/వార్డు సచివాలయంలో సంబంధిత PS/WEA, WWDS/WAS వీరికి పించను మొతాన్ని తప్పనిసరిగా పంపిణి చేయాలని తెలిపారు. పెన్షన్ల పంపిణీ డిసెంబర్ 1న అదే రోజు 100 శాతం ఫించన్ల పంపిణీ చేయాలని, దానికి అనుగుణంగా ఎంపీడీఓ మరియు మునిసిపల్ కమీషనర్లు పింఛను పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి ఫించన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని, అలాగే ఫించన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది ఉదయం వారి పంపిణీ ప్రదేశానికి ఉదయం 6.30 గం.ల లోగా చేరుకుని తప్పకుండా ఆరోజు ఉదయం 7.00 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క పొరపాటు జరగకుండా ఫించన్లు పంపిణీ జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పెన్షన్ పంపిణి చేయు అధికారి పెన్షన్ దారులతో గౌరవ ప్రదంగా వ్యవహరించాలని, అవినీతికి పాల్పడరాదని మరియు ఇంటి వద్దనే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయవలెనని తెలియజేశారు. ఎవరైనా దీనిని అతిక్రమించినచో క్రమశిక్షణా చర్యలు తీసుకోబడునని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అలాగే గత నెలలలో ఏదేని కారణంతో ఫించన్ తీసుకోని వారికి ఈ నెల పించన్ మొత్తంతో కలిపి పంపిణీ చేయాలని అన్నారు. కావున ఈ సమాచారం అందరికి తెలియచేయాలని మండల పరిషత్ అభివృద్ది అధికారులను, మునిసిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫించన్ దారులకు అందరికీ IVRS విధానం పై వ్యక్తిగతంగా తెలియచేయాలని కలెక్టర్ తెలిపారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...