Skip to main content

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం - ఏఐఎస్ఎఫ్

ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కరపత్రాలు విడుదల
ఉరవకొండ:: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు జాత ముగింపు సభని జయప్రదం చేయాలని కోరుతూ ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని గత నెల అక్టోబర్ 22న ఇచ్చాపురంలో ప్రారంభమై నవంబర్ 12వ తేదీ అనంతపురంలో ముగింపు సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 6400 కోట్లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేసి తక్షణమే ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వైద్య విద్యకు శాతంగా మారిన జీవో నెంబర్ 107 108 మరియు పేద విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని యువగళం పాదయాత్రలో నరా లోకేష్ ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే జీవో నెంబర్ 107 108 77 రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల కేజీబీవీ మోడల్ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించి పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్ చార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలనీ, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు భర్తీ చేయకుండా మూడు నాలుగు హాస్టళ్లకు ఒకరే వార్డెన్ లో నియమించడం వల్ల విద్యార్థులు సరైనటువంటి సౌకర్యాలు అందడం లేదని మండిపడ్డారు.రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమస్యల పైన రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు జాత ముగింపు సభను జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో నియోజవర్గ కోశాధికారి రాజు ఉపాధ్యక్షులు కరుణాకర్ నియోజకవర్గ నాయకులు సిద్ధిక్, మన్సూర్ వలి తదితర విద్యార్థులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...