Skip to main content

పని ‘హక్కు’కాదట


 !

పని హక్కు అనేది మనిషి గౌరవానికి, జీవనోపాధికి అవసరమైన ప్రాథమిక హక్కు.న్యాయమైన,సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ప్రతి మనిషికీ వుంది.గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని పని కోసం ఉపాధి హామీ పథకాల ద్వారా చట్టపరమైన పని హక్కు కల్పించబడుతోంది.

అంతేకాదు,నిర్దిష్ట పనిగంటలు అమలు జరుగుతున్నాయి.దేశంలోని ప్రతి వ్యక్తీ సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావాల్సిన కనీస సదుపాయాలే ప్రాథమిక హక్కులు.‘భారత ప్రజాస్వామ్యా నికి పునాదిరాళ్లు ప్రాథమిక హక్కులు’అంటారు నానీ ఫాల్కీవాలా.

పనిహక్కు అనేది ప్రజలకు ఉత్పాదక పనిలో పాల్గొనే ప్రాథమిక హక్కును సూచిస్తుంది.దీనిని 1948 ఐరాస మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో పొందుపరిచారు.భారత రాజ్యాంగం, ముఖ్యంగా ఆర్టికల్‌ 21, 41 ప్రకారం…జీవించే హక్కులో భాగంగా పనిచేసే హక్కుకు హామీ ఇస్తుంది.ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా స్వేచ్ఛ అసంభవం’ అంటారు గాంధీజీ.

కానీ,ఆర్థిక స్వాతంత్య్రం…పని లేకుండా సాధ్యం కాదు.పని-కేవలం ఆదాయం సంపాదించే మార్గం మాత్రమే కాదు,అది ఒక వ్యక్తికి గౌరవం,సామాజిక భాగస్వామ్యం,ఆత్మగౌరవాన్ని కల్పించడం.

‘జాతీయ కార్మిక విధానం 2025-2047 ముసాయిదా’ కొద్ది రోజుల్లో అమలులోకి రానుంది.మూడు దశల్లో అంటే…

 2025-27,2027-37,2037-47 లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.తద్వారా దాదాపు 50 కోట్ల మంది శ్రామికులను ప్రభావితం చేస్తుందని అంచనా.జస్టిస్‌ గజేంద్ర గడ్కర్‌ నేతృత్వంలోని మొదటి కార్మిక సంఘం సిఫార్సుల మేరకు అనుస రిస్తున్న సామాజిక భద్రత, పారిశ్రామిక భద్రత,వేతనాల స్థిరీకరణ వంటి కార్మిక చట్టాలను ఈ విధానం అణచివేస్తుంది.‘ ప్రభుత్వం గొప్పతనం,అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి వుంటుంది’ అంటారు హెచ్‌.జె.లాస్కి.

 మోడీ ప్రభుత్వంలో అమలు చేయనున్న జాతీయ కార్మిక విధానం…కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పూర్తిగా మార్చివే సింది. కొత్త ప్రతిపాదన ప్రకారం,ఉపాధి ఇకపై ఒక కర్తవ్యం మాత్రమే,హక్కు కాదు.కొత్త విధానం పనిని ఒక హక్కుగా తొలగించి,దానిని ధర్మంగా,ఒక కర్తవ్యంగా,సేవగా మారుస్తున్నది.ఇది భారత రాజ్యాంగం యొక్క మౌలిక సిద్ధాంతాలను అణచివేయడమే. అంతేకాదు..కార్మికులకు వ్యతిరేకంగా, యజమానులకు రక్షణగా కొత్త జాతీయ విధానం వుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 శతాబ్దాల పోరాటం ద్వారా సంక్రమించిన హక్కులు కోల్పోవడమే కాకుండా,బలహీనమైన కార్మికులను పూర్తిగా వీధిలోకి విసిరేస్తారు.రాజధర్మం పేరుతో కార్మిక హక్కులు త్యాగం చేయబడితే,ఆర్థికాభివృద్ధి ఒక వర్గానికే లాభిస్తుంది.దాతృత్వం,ఔదార్యం ముసుగులో హక్కులులేని బానిసలుగా శ్రామికులు మారతారు.2024 లెక్కల ప్రకారం…భారతీయ శ్రామిక శక్తి దాదాపు 61 కోట్లు.

ఈ విధానంతో దేశంలోని 50 కోట్లకు పైగా వున్న శ్రామికుల భవిష్యత్‌ ప్రమాదంలో పడింది.శ్రమను హక్కుగా కాక ధర్మంగా బోధించడం అంటే, అంబేద్కర్‌ స్వప్నించిన సమానత్వ రాజ్యాన్ని రద్దు చేయడమే.మనుస్మృతి ఆధారిత ఆలోచనలను శ్రమ న్యాయాలుగా మలచడం అంటే రాజ్యాంగాన్ని సవాలు చేయడమే.

ఈ దేశంలో ప్రజాస్వామ్యం…హక్కుల పునాది పైనే ఆధారపడి వుంది.పని హక్కుగా వుండాలి…దాతృత్వంగా కాదు.యువత భారతదేశం యొక్క గొప్ప సంపద.ప్రతి ఏడాదీ లక్షలాది యువతీ యువకులు ఉపాధి ఆశతో మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగం,ఉపాధిలేమి వారిని నిరాశ,నిస్పృహలలోకి నెట్టేస్తున్నది. శ్రమించేవారికి భద్రత ఇవ్వకుండా, దేశాభివృద్ధిని ఆశించడం స్వప్నమే తప్ప,వాస్తవం కాదు’అంటారు అమెరికన్‌ ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కెయిన్స్‌.దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే…

 ఉద్యోగాల కల్పన ప్రధాన లక్ష్యం కావాలి.కార్మికుల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం,సామాజిక భద్రత కల్పించడం ద్వారా ఆర్థిక పురోగతికి దోహదపడాలి.అంతేతప్ప…ప్రజావ్యతి రేక విధానాలను తెచ్చి, కార్మికవర్గాన్ని, సామాజిక న్యాయాన్ని బలి చేయకూడదు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...