Skip to main content

సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ. మంత్రి నారా లోకేష్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బార్

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా అర్జీలు పరిష్కరించి అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు

అక్రమ కేసులతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వేధించారు

- టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో వైసీపీ హయాంలో అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనపై అక్రమంగా హత్య కేసు బనాయించి ఇబ్బందులకు గురిచేశాడని, దీంతో తీవ్రంగా నష్టపోయానని సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం శిరిగారిపల్లికి చెందిన కే.రవీంద్ర మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

- మాజీ సైనికుల సేవలను గుర్తించి కడప నగరం లేదా చింతకొమ్మదిన్నె మండలంలో 250 మంది మాజీ సైనికుల కుటుంబాలకు ఉచితంగా లేదా, ప్రభుత్వ నామమాత్రపు ధరతో పదెకరాల స్థలాన్ని కేటాయించి అండగా నిలవాలని కడపకు చెందిన జై జవాన్ మూచ్యువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

- అనంతపురం జిల్లా గుంతకల్లు 7వ వార్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన సురేష్ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. రోడ్లు, డ్రైనేజీ సదుపాయం కల్పించడంతో పాటు విద్యా సదుపాయాలు మెరుగుపర్చాలని విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

- వంశపారంపర్యంగా తమకు సంక్రమించిన 4.86 ఎకరాల వ్యవసాయ భూమిని వైసీపీ నేతలు ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని కడప జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లెకు చెందిన కస్తూరి రామన్న మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ భూమిని సాగుచేయకుండా అడ్డుకుంటున్నారని, సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తమ భూమిని తిరిగి అప్పగించాలని విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

- పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఏఎస్ఆర్ జిల్లా దేవీపట్నం, పూడిపల్లికి చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దేవీపట్నంలో పునరావాస కాలనీ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. 

- భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్న తన తల్లి గారు 9 నెలల క్రితం మరణించారని, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కింద తమకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కోడూరు అశోక్ విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 

- పలు రాష్ట్రాల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఒంగోలుకు చెందిన మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ రియల్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ బాధితులకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా, మద్దికెర మండలం, పెరవలికి చెందిన ఎమ్.రంగస్వామి మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

- వైసీపీ హయాంలో తొలగించిన దివ్యాంగ పెన్షన్ ను పునరుద్ధరించడంతో పాటు కష్టాల్లో ఉన్న తమకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజయవాడ రాణిగారితోటకు చెందిన షేక్ గుల్జార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

- ఆప్కాస్ కింద ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం చేస్తున్న తాను రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయానని, అయితే పొరుగు సేవల ఉద్యోగి కావడంతో తనకు దివ్యాంగ పెన్షన్ అందడం లేదని గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన యు.భాస్కర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రేషన్ కార్డు పరిధిలో ఉండటంతో దివ్యాంగుడైన తన తండ్రికి కూడా వైసీపీ హయాంలో పెన్షన్ తొలగించారని వాపోయారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

- అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందానని, ఎలాంటి ఆధారం లేని తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజయవాడ జక్కంపూడికి చెందిన అన్నె వసుంధర మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...