Skip to main content

ఉరవకొండ లో ఊరూరా మద్యం బెల్ట్ షాపులు అరికట్టాలి



 


-మహిళలపై జరుగుతున్న హింస ను నియంత్రించాలి

ఉరవకొండ మండలం లో

 గ్రామీణ ప్రాంతాలలో విచ్చలవిడిగా వెలిసిన మద్యం బెల్ట్ షాపులను ప్రభుత్వం అరికట్టాలని, మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసను నియంత్రించాలని సిపిఐ పార్టీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య (ఎన్ఎఫ్ ఐడబ్ల్యూ) అనంతపురం జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్ తెలిపారు. 

మంగళవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మద్యం బెల్ట్ షాపుల వల్ల యువత మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అంతేకాకుండా మద్యం కారణంగా అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని రోడ్డు ప్రమాదాలు కుటుంబ కలహాలు మద్యం వల్ల జరుగుతున్నాయని ప్రభుత్వం తక్షణమే వీటిని నియంత్రించాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం వెంటనే అమలు చేయాలన్నారు. ఉచిత గ్యాస్ పథకం కూడా అనేకమంది మహిళలకు అందడం లేదని అర్హులైన వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలన్నారు. తల్లికి వందనం, అన్నదాత పథకాల్లో కూడా అనేకమంది అర్హులైన వారికి అన్యాయం జరిగిందన్నారు. 

మహిళలకు ఉచిత బస్సు పథకం సామాన్య మహిళల కన్నా ఉద్యోగులకు, సంపన్న వర్గాలకి ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రభుత్వం అరికట్టాలని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిరు వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలన్నారు. మహిళలుకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలని మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన చట్టాలను బలోపేతం చేయాలని మహిళలు, దళితులపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం అరికట్టాలన్నారు. 


మహిళల హక్కులు మరియు సమానత్వం గురించి సమాజంలో ప్రభుత్వాలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులైన మహిళలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని ఆహారం, ఆరోగ్యం, జీవిత భద్రతను ప్రభుత్వాలు కల్పించాలన్నారు. ఉరవకొండ పట్టణంలో స్థానిక శివరామిరెడ్డి కాలనీలో తాగునీటి సరఫరా కాకపోవడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కాలనీలో మంచినీళ్లు సదుపాయం కల్పించాలని కోరారు.

 నూతన కమిటీ ఎన్నిక

 ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ( ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ) ఉరవకొండ నియోజకవర్గం నూతన శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్ తెలిపారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా సమైక్య సమావేశాన్ని నిర్వహించి ఎన్నుకున్నట్లు ఆమె తెలిపారు. నియోజకవర్గ కన్వీనర్ గా నూర్జహాన్, కో కన్వీనర్ గా అశ్వర్తమ్మ, నాగలక్ష్మి కార్యవర్గ సభ్యులుగా సంజమ్మ, రజియా తదితరులను ఎన్నుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఉరవకొండ నియోజకవర్గ సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు గన్నె మల్లేష్, పురిడి తిప్పయ్య, రైతు సంఘం నాయకులు వరప్రసాద్ మహిళా సమైక్య నాయకురాలు యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...