Skip to main content

నిమ్మల రామానాయుడు గారి డొంక తిరుగుడు సమాధానంతో గందరగోళం!



 పోలవరం నుండి నల్లమల సాగర్ రిజర్వాయర్ వరకు రెండు దశల్లో నిర్మాణం చేపడితే,నల్లమల సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని శ్రీశైలం రిజర్వాయర్ లోకి ఎత్తి వస్తారా,లేక రివర్స్ పంపింగ్ ద్వారా బనకచర్లకు తీసుకెళ్తారా? లేక సోమశిల రిజర్వాయర్ కు తీసుకెళ్లాలా? అనే అంశం పై జలవనరుల శాఖా మాత్యులు నిమ్మల రామానాయుడు గారు చెప్పిన డొంక తిరుగుడు సమాధానం, తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడకు గడ్డి కోయడానికి అన్నట్లుగా ఉంది.

    పోలవరం-బనకచెర్ల డిపిఆర్ తయారు చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను ఎందుకు రద్దు చేశారో నిజాయితీగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ శాఖ మంత్రి పైన ఉన్నది.

     మంత్రిగారి డొంక తిరుగుడు సమాధానం ప్రజలలో మరింత గందరగోళాన్ని సృష్టించడానికి దోహదపడేలా ఉన్నది. ఈ వ్యాఖ్యలు ముమ్మాటికీ అవగాహనా రాహిత్యంతో చేసినవి తప్ప మరొకటి కాదు.

   నిపుణులతో మాట్లాడిన తర్వాత టెండర్లు రద్దు చేశామని చెప్పారు,బాగానే ఉన్నది,కానీ ఏ నిపుణులు,ఏ ఇంజనీరింగ్ అధికారులు నల్లమల సాగర్ నుండి శ్రీశైలం జలాశయానికి,లేదా బనకచర్లకు తరలించే సూచనలు చేశారో చెప్పగలరా?

     రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల భారీ ఎత్తిపోతల పథకం లోప భూయిష్టమైనదని,కృష్ణా నదీ జలాలపై ఆంధ్ర ప్రదేశ్ కు ఉన్న హక్కులను ప్రమాదంలోకి నిడుతుందని చెప్పినా వినలేదు.చివరికి,ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత చవిచూడాల్సి వచ్చింది. అయినా కూడా ఇంత గందరగోళంలో ఉండడం ఆశ్చర్యం.

    కృష్ణా నదీ జలాలను శ్రీశైలం జలాశయం నుండి గ్రావిటీ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదుగా తెలుగు గంగ,గాలేరు-నగరి ప్రాజెక్టులకు సరఫరా చేయాలి.వాటి నిర్మాణాలను సత్వరం పూర్తి చేయాలి.2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కృష్ణ నీటిని సర్దుబాటు చేయాలంటూ ఆ ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించింది.తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది,ఈ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేడు విచారణ కూడా చేస్తున్నది,ఈ నేపథ్యంలో మంత్రి గారి వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరం.

     ఇదివరకే ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి రాయలసీమ ప్రాంత ప్రజాసంఘాలు,సాగునీటి రంగ నిపుణులు రాతపూర్వకంగా విజ్ఞాపన పత్రాలను సమర్పించడం జరిగింది, అయినా మేము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న సామెతగా ప్రభుత్వం పోలవరం-బనకచర్ల భారీ ఎత్తిపోతల పథకంపై డిపిఆర్ కోసం టెండర్ పిలిచింది. నేడు ఎందుకు రద్దు చేసుకున్నదో పారదర్శకంగా జవాబుదారితనంతో చిత్తశుద్ధితో వాస్తవాలను ప్రజలకు వివరించాలి.

    జాతీయ నదుల అనుసంధానంలో అంతర్భాగంగా గోదావరి,కృష్ణ, పెన్నా నదుల (పోలవరం- బొల్లాపల్లి -సోమశిల) అనుసంధాన పథకమే అమలు చేయాలనుకుంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు,మరియు నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణకు నీరు అందించే విధంగా వైకుంఠపురం సమీపంలో కృష్ణానదిని దాటించేలా చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామ

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...