ఉరవకొండ జనవరి 6:
ఏపీ ఎన్జీవో జిల్లా జాయింట్ సెక్రెటరీ గా హృషీకేశ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు వేసి శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. జిల్లా స్టాంప్స్ మరియు రిజిస్టార్ కార్యాలయంలో హృ షీకేష్ సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు . ఎలాంటి అర మరికలు లేకుండా విధులు నిర్వహిస్తున్న హృషీకేష్ మచ్చలేని ఉద్యోగి, నాయకులని పలువురు ఉద్యోగులు అభినందనలతో ముంచెత్తారు. అప్పగించిన బాధ్యతలు దీక్షతో రాగద్వేషాలకతీతంగా చేపడతానని హృషీకేష్ తెలిపారు.
