ఉరవకొండలో భోగి మంటల్లో మెడికల్ కాలేజీల 'PPP' జీవో దహనం

Malapati
0


 

వైద్య విద్య ప్రైవేటీకరణపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన గళం

ఉరవకొండ జనవరి 14 :

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ ఉరవకొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపారు. భోగి పండుగను పురస్కరించుకుని, ఉరవకొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన భోగి మంటల్లో వివాదాస్పద జీవో ప్రతులను వేసి దహనం చేశారు.

ప్రైవేటీకరణను అడ్డుకుంటాం:

నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శ్రీ వై. విశ్వేశ్వర్ రెడ్డి, యువ నాయకులు వై. ప్రణయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. "ప్రజల గుండెల్లో మండుతున్న ఆవేదనకు ఈ భోగి మంటలు ప్రతీక. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా ప్రభుత్వం తెచ్చిన PPP విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి" అని డిమాండ్ చేశారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు:

ఈ నిరసన కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముత్తులూరి అశోక్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు డిష్ సురేష్, మండల రూరల్ అధ్యక్షులు ఎర్రి స్వామి రెడ్డి, మండల సమన్వయకర్త ఓబన్న, నాయకులు బీమా మారెషు, మహానంది మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!