Skip to main content

విజయవాడ దుర్గగుడి ధర్మకర్తల మండలిలో 16 మంది కొత్త సభ్యుల నియామకం

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం (దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం) ధర్మకర్తల మండలి పునర్‌వ్యవస్థీకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 16 మందిని సభ్యులుగా ఎంపిక చేస్తూ జాబితాను ఖరారు చేసింది. ఇందులో తెలుగు దేశం పార్టీకి అత్యధికంగా 11 స్థానాలు, జనసేన పార్టీకి మూడు, భారతీయ జనతా పార్టీకి రెండు స్థానాలు కేటాయించబడ్డాయి. అదనంగా ప్రత్యేక ఆహ్వానితులుగా విజయవాడకు చెందిన మార్తి రమాబ్రహ్మం, ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యకుమార్లను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన జీవో అధికారికంగా త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే పోరంకి ప్రాంతానికి చెందిన బొర్రా రాధాకృష్ణను ఆలయ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రకటించిన జాబితాతో ధర్మకర్తల మండలి పూర్తయింది. ఈ నియామకాలు ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పనులపై ప్రభావం చూపనున్నాయి. మండలి సభ్యుల జాబితా: విజయవాడ వెస్ట్ నుంచి అవ్వారు శ్రీనివాసరావు (బీజేపీ), విజయవాడ సెంట్రల్ నుంచి బడేటి ధర్మారావు (టీడీపీ), మైలవరం నుంచి గూడపాటి వెంటక సరోజినీ దేవి (టీడీపీ), రేపల్లె నుంచి జీవీ నాగేశ్వర్ రావు (టీడీపీ), హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ (టీడీపీ తెలంగాణ), తాడిపత్రి నుంచి జింకా లక్ష్మీ దేవి (టీడీపీ), నందిగామ నుంచి మన్నె కళావతి (టీడీపీ), దెందులూరు నుంచి మోరు శ్రావణి (టీడీపీ), విజయవాడ వెస్ట్ నుంచి పద్మావతి ఠాకూర్ (జనసేన), నెల్లూరు రూరల్ నుంచి పనబాక భూ లక్ష్మి (టీడీపీ), విజయవాడ సెంట్రల్ నుంచి పెనుమత్స రాఘవ రాజు (బీజేపీ), పెనమలూరు నుంచి వెలగపూడి శంకర్ బాబు (టీడీపీ), విజయవాడ వెస్ట్ నుంచి సుకాశి సరిత (టీడీపీ), నందిగామ నుంచి తంబాళపల్లి రమాదేవి (జనసేన), తెనాలి నుంచి తోటకూర వెంటక రమణా రావు (జనసేన), పెనమలూరు నుంచి అన్నవరపు వెంటక శివ పార్వతి (టీడీపీ) ఎంపికయ్యారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...