Skip to main content

ఎస్టిఐ రమణమ్మా.. నీ ఈ సడింపు చర్యలు మానమ్మా!


 ​.కొందరికి మోదం.. అందరికీ ఖేదం.

-​ఉరవకొండ డిపో ఉద్యోగుల సమస్యలపై 

 డిపో మేనేజర్, ఎస్ టి ఐ చర్యలతో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఒకరివి ఒంటెత్తు పోకడలైతే, మరొకరి విసడింపు చర్యలతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. డిపో మేనేజర్ చర్యలు అందరి ప్రయోజనాలకు కాకుండా కొందరికి మాత్రమే మేలు చేకూరేలా ఉందనే విమర్శలు వెళ్ళుతున్నాయి. ఇది ఇలా ఉంటే రమణమ్మ పరిస్థితి నేటి యొక్క ఒకనాటి కోడలు అన్న చందంగా మారింది. కండక్టర్ స్థాయి నుంచి ఎస్ టి ఐ స్థాయికి ఎదిగిన ఆమె సిబ్బంది పట్ల బూతులు వల్లించడం ఉద్యోగస్తులకు మింగుడు పడటం లేదు. ఆమెన్ పై అనేక అవినీతి ఆరోపణలు రాత మూలకంగా ఫిర్యాదు చేసిన అవి బుట్ట దాఖలు కావటం హాట్ టాపిక్ గా మారింది. మేం ఇంతే మారం అంతే అన్న చందంగా ఇరువురి పరిస్థితులతో సిబ్బంది తలబాదుకుంటున్నారు.

​ఉరవకొండ డిపోలో ఉద్యోగులు గత కొంతకాలంగా రెండు ప్రధాన సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించమని పలుమార్లు డిపో మేనేజర్‌ను కోరినా ఎటువంటి స్పందన లేకపోవడంతో కార్మిక పరిషత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టాలని నిర్ణయించారు.

​1. డిజిటల్ ఛార్టు జారీలో జాప్యం

​డిపోలో చివరిసారిగా డిజిటల్ ఛార్టును 06.12.2023న వేశారు. హెడ్ ఆఫీస్ ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం కొత్త డిజిటల్ ఛార్టు వేయాల్సి ఉన్నప్పటికీ, దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా కొత్త ఛార్టు వేయలేదు.

​గత ఆరు నెలలుగా ఉద్యోగులు డిపో మేనేజర్ ను ఈ విషయంపై కోరుతూ మూడు సార్లు మెమొరాండం కూడా సమర్పించారు. అయినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

​కొందరు ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడానికి మాత్రమే మేనేజర్ ఈ విషయంలో జాప్యం చేస్తున్నారని ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

​2. ఎస్.టి.ఐ. రమణమ్మ వేధింపులు:

​డిపోలో ఎస్.టి.ఐ. రమణమ్మ వేధింపులు హద్దు మీరిపోయాయి. ఆమె ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు తిడుతూ, నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారు.

​సెలవులు కోరినా లేదా ఏదైనా విషయం గురించి అడిగినా ఆమె ఉద్యోగులపై అరుస్తున్నారు. తన కింద పనిచేసే ఎ.డి.సి. (ADC), డి.సి. (DC) లను కూడా అసభ్యంగా తిడుతున్నారని, దీనిపై పై అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎటువంటి మార్పు రాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​ఎస్.టి.ఐ. రమణమ్మ ఉద్యోగులను బానిసలుగా చూస్తున్నారని, తాను యజమాని అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉద్యోగులను అవమానిస్తున్నారని ఉద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

​డిమాండ్ మరియు నిరసన:

​ఈ రెండు ప్రధాన సమస్యలను డిపో మేనేజర్ పరిష్కరించడంలో విఫలమవడంతో, కార్మిక పరిషత్ అసోసియేషన్ ఉద్యోగులు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ఉద్యోగుల ఆందోళన, భయాన్ని దృష్టిలో ఉంచుకుని పై అధికారులు తక్షణమే ఈ సమస్యలపై జోక్యం చేసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఈ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యోగుల తరపున నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...