భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. మణుగూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ, అదే స్టేషన్లో ఎస్హెచ్ఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బతిని రంజిత్పై అవినీతి నిరోధక శాఖ (ACB) ఉచ్చు వేసింది. నోటీసుల జారీకి ప్రతిఫలంగా లంచం డిమాండ్ చేసిన ఆరోపణలతో ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం, మణుగూరు పోలీస్ స్టేషన్లో Cr. No. 292/2025 కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఫిర్యాదుదారుని మరియు అతని సోదరుడిని BNSS చట్టంలోని సెక్షన్ 35(3) కింద విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత, ఎస్హెచ్ఓ రంజిత్ ఫిర్యాదుదారుని నుండి రూ.40,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుదారుడు దీనిపై ACBను సంప్రదించడంతో, క్రిమినల్ మిస్కండక్ట్ కేసు నమోదు చేసి అధికారిని అరెస్టు చేశారు.
ప్రస్తుతం ఆయనను వరంగల్లోని SPE & ACB ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు శాఖ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుని భద్రతా కారణాల దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ACB అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని సూచించారు. అదనంగా, WhatsApp (9440446106), Facebook (Telangana ACB), X/ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా ఫిర్యాదులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. బాధితుడి పేరు, వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టబోమని హామీ ఇచ్చారు.
ఈ ఘటన మరోసారి పోలీసు వ్యవస్థలో అవినీతి సమస్యను వెలుగులోకి తెచ్చింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని ప్రజలు భావిస్తున్నారు. అవినీతిని అరికట్టడానికి ACB చేపడుతున్న చర్యలకు మద్దతుగా ముందుకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment