యంగ్ హీరోయిన్ల స్థానంలో సీనియర్ బ్యూటీ.. టాలీవుడ్లో కొత్త చర్చ
టాలీవుడ్: మెగాస్టార్ చిరంజీవి ఐదు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న క్రేజ్తోపాటు, ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ను సెట్ చేయడం ద్వారా అభిమానుల మన్ననలు అందుకుంటున్నాడు. ఈసారి అతను మరొక సరికొత్త ప్రయత్నానికి సిద్ధమవుతున్నాడు – స్పెషల్ సాంగ్లో యంగ్ హీరోయిన్ల స్థానంలో ఓ సీనియర్ బ్యూటీని తీసుకోవడం.
ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించనున్నది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో మెగాస్టార్ ప్రత్యేకంగా ఒక సీనియర్ హీరోయిన్తో స్పెషల్ సాంగ్ రికార్డు చేయాలనుకున్నాడు.
మొదట అనీల్ డైరెక్టర్ పూజ హెగ్డే, తమన్నా వంటి యంగ్ హీరోయిన్లను ఆ పాటకు సెలెక్ట్ చేయాలని భావించినప్పటికీ, చిరంజీవి “ఈ స్పెషల్ సాంగ్ ట్రెండ్ సెట్ అవ్వాలి” అనే కారణంతో సీనియర్ బ్యూటీని తీసుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. డైరెక్టర్ కూడా ఈ వైవిధ్యమైన కాన్సెప్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటి వరకు మేకర్స్ వివిధ సీనియర్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో మీనా, టబూ, రమ్యకృష్ణ, కుష్బూ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీలో ఈ ప్రయత్నం ఒక సెన్సేషన్గా మారే అవకాశం ఉంది. ఈ స్పెషల్ సాంగ్ ద్వారా ఆడియన్స్ను ఆకట్టుకోగలిగితే, యంగ్ హీరోయిన్లకు కూడా ఒక కొత్త అవకాశ వేదిక ఏర్పడుతుంది. ఈ ట్రెండ్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది త్వరలో స్పష్టమవుతుంది.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment