హైదరాబాద్: నగరాన్ని అతలాకుతలం చేస్తున్న మూసీ వరదల పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
కమిషనర్ చాదర్ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితులను సమీక్షించారు. ముఖ్యంగా చాదర్ఘాట్ పరిసరాల్లో నది నీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించారు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వరదలో ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించే చర్యలను కమిషనర్ ప్రత్యక్షంగా గమనించారు. ఎంజీబీఎస్ సమీపంలో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో నీరు లోపలికి ప్రవేశించిన ప్రాంతాలను కూడా పరిశీలించారు.
దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా DRF బృందాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చొరబడినప్పుడు DRF, పోలీసులు, RTC, GHMC సిబ్బంది కలసి వందలాది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఆయన అభినందించారు.
మూసీ వరదల దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, NDRF, SDRF, GHMC, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, తాను వ్యక్తిగతంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని శ్రీ ఏవీ రంగనాథ్ తెలిపారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment