మంచిర్యాల, సెప్టెంబర్ 27: ప్రభుత్వ పనులను అడ్డుపెట్టి లంచం తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ టెక్నికల్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కాడు.
కన్నెపల్లి మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బానోత్ దుర్గాప్రసాద్, అధికారిక సహాయం పేరుతో రూ.10,000 లంచం తీసుకుంటూ రంగేహస్తంగా పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే– లింగాపూర్ గ్రామ శివార్లలో మజ్దూర్ గారంటీ పథకం (MGNREGS) కింద ఫిర్యాదుదారుడు కొత్తగా నిర్మించిన పశువుల కొట్టానికి సంబంధించిన పెండింగ్ MB ఎంట్రీలను నమోదు చేయడం, బిల్లు మంజూరు చేయడం కోసం లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడి ఇంటిలో నగదు స్వీకరిస్తుండగా ACB అధికారులు ఆకస్మికంగా దాడి చేసి అతన్ని పట్టుకున్నారు.
అధికారుల సమాచారం మేరకు, రూ.10,000/- కళంకిత లంచం మొత్తం దుర్గాప్రసాద్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. విధులను నిజాయితీగా నిర్వర్తించకుండా వ్యక్తిగత ప్రయోజనాన్ని పొందేందుకు లంచం స్వీకరించాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి, కరీంనగర్ SPE & ACB ప్రత్యేక కోర్టు గౌరవనీయ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
🔔 ప్రజలకు సూచన:
ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో వెంటనే ACB టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), X/ట్విట్టర్ (Telangana ACB) ద్వారా కూడా సమాచారం అందించవచ్చు. ఫిర్యాదుదారుల పేరు, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు హామీ ఇచ్చారు.
పి.ఆర్. 2719 – అవినీతి నిరోధక శాఖ, తెలంగాణ, హైదరాబాద్
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment