ములుగు జిల్లా: మేడారం ప్రాంతంలో సమ్మక్క-సారలమ్మల కీర్తిని ప్రపంచానికి చాటేలా, వారి వైభవం తరతరాలకు నిలిచేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో శాశ్వత అభివృద్ధి పనుల శంకుస్థాపన మరియు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం డిజైన్ సమీక్ష కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈరోజు ములుగు జిల్లాకు విచ్చేశారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో సహచర గౌరవ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, శ్రీ అడ్లూరి లక్ష్మణ్, శ్రీ పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. కార్యక్రమాన్ని దాసరి సీతక్క హృదయపూర్వక స్వాగతం పలికారు.
స్థానిక ప్రజలు, భక్తులు, అధికారులు ఈ రోజు మేడారం వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి, అభివృద్ధి పనులను సమీక్షించే అవకాశాన్ని పొందారు. ఈ కార్యక్రమం కేవలం భవిష్యత్తు ప్రాజెక్టుల ప్రారంభం మాత్రమే కాదు, సమ్మక్క-సారలమ్మల సాంప్రదాయాల వారసత్వాన్ని భద్రపరిచే ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తోంది.
ఈ శంకుస్థాపనతో మేడారం ప్రాంతంలో భవిష్యత్తులో పర్యాటక, సాంస్కృతిక, ఆర్ధిక అవకాశాలు మరింత విస్తరిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment