పాస్ పోర్టు కోసం ఇకపై ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి నిరీక్షణకు తెరపడనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం మొబైల్ పాస్ పోర్టు వాహనాన్ని ప్రారంభించింది.
🔹 పాస్ పోర్టు సేవా పోర్టల్లో వాహనం ఎప్పుడు, ఎక్కడకు వస్తుందో సమాచారం అందుబాటులో ఉంటుంది.
🔹 దాన్ని బట్టి ఆన్లైన్లో ఫారం నింపి, రుసుము చెల్లించి, వాహనం వచ్చినప్పుడు నేరుగా వెళ్లొచ్చు.
🔹 ఈ వాహనంలో నలుగురు సిబ్బంది ఉంటారు. రోజుకు 40 మందికి సంబంధించిన ధ్రువపత్రాలు పరిశీలించి, బయోమెట్రిక్, ఫొటో తీసి పాస్ పోర్టు నమోదు చేస్తారు.
🔹 పరిశీలన పూర్తయిన తర్వాత పాస్ పోర్టు తపాలా ద్వారా ఇంటికే వస్తుంది.
గుంటూరు జిల్లా మంగళగిరి వి.టి.జె.ఎం & ఐ.వి.టి.ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఈ మొబైల్ పాస్ పోర్టు వాహనాన్ని అందుబాటులో ఉంచారు. రెండు రోజుల పాటు ఇక్కడ సేవలు అందిస్తారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment