పెరుపాలెం (నరసాపురం): రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మండలంలో పర్యటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న పెరుపాలెం గ్రామాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి కేశవ్ గ్రామంలోని శ్రీ శివాలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
పెరుపాలెం చేరుకున్న మంత్రికి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.


Comments
Post a Comment