సంప్రదాయ పంటలతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు కొత్త మార్గాల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ అధికారులు రైతులకు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే ఈ పంటతో రైతులు స్థిరమైన ఆదాయం పొందగలరని చెబుతున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, డ్రాగన్ ఫ్రూట్ సాగుతో ఎకరానికి ఏటా రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దేశీయంగానే కాకుండా ఎగుమతుల మార్కెట్లో కూడా ఈ పంటకు మంచి డిమాండ్ ఉందని వారు వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఆధారంగా పరికరాలు, సాంకేతిక సహాయం అందిస్తోంది.
ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు కలిగించే ఔషధ గుణాలు డ్రాగన్ ఫ్రూట్లో ఉండటంతో మార్కెట్లో దీని విలువ రోజురోజుకు పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మధుమేహం, హృద్రోగ సమస్యలను నివారించడంలో తోడ్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రైతులు సాంప్రదాయ పంటల కంటే డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తే, తక్కువ కాలంలోనే అధిక లాభాలు సాధించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ పంట భవిష్యత్తు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment