Skip to main content

మత సామరస్యానికి ప్రతీక: జైనబ్బీ దర్గా

 సీతమ్మ వారి అంశగా హిందువుల నమ్మకం.

ఉరవకొండలో ఉన్న జైనబ్బీ దర్గా హిందూ-ముస్లిం ఐక్యతకు గొప్ప ఉదాహరణ. ఈ దర్గాని స్థానికులు పాక్ థామస్ పీరతు నీవ్రాసా హజ్రత్ బీబీ రహంతుల్లా అలైహ వారి దర్గాగా కూడా పిలుస్తారు. ఇక్కడ అన్ని మతాల ప్రజలు కలిసి ప్రార్థనలు చేస్తారు. కేవలం ఉరవకొండ నుంచే కాకుండా కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ దర్గాని సందర్శించి తమ మొక్కులు చెల్లించుకుంటారు.

జైనబ్బీ దర్గా చరిత్ర, విశిష్టత

జైనబ్బీ దర్గా నిర్మాణానికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలు లేనప్పటికీ, దీని గురించి ఒక ఆసక్తికరమైన కథనం స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ కథనం ప్రకారం, జైనబ్బీ అమ్మవారు కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతానికి చెందిన అపూర్వ సౌందర్యరాశి. దేశ పర్యటనలో భాగంగా ఆమె ఉరవకొండకు చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు బ్రిటిష్ సైనికులు ఆమెను దురుద్దేశంతో వెంబడించారు. వారి నుంచి తప్పించుకోవడానికి మార్గం లేక, జైనబ్బీ అమ్మవారు భూమాతను వేడుకున్నారు. దీంతో భూమి రెండుగా చీలి ఆమెను తనలోకి తీసుకుని, తిరిగి యథాస్థితికి చేరుకుంది.

ఈ విషయం తెలుసుకున్న సైనిక కమాండర్ అహంకారంతో ఆమెను దుర్భాషలాడగా, ఆయన దృష్టి కోల్పోయారు. తన తప్పు తెలుసుకుని, అమ్మవారిని పశ్చాత్తాపంతో వేడుకోగా, ఆమె ఆయనకు తిరిగి దృష్టి ప్రసాదించినట్లు చెబుతారు. ఆ కమాండరే ఆ ప్రదేశంలో సమాధిని నిర్మించినట్లు స్థానికంగా ప్రచారం ఉంది.

హిందువుల నమ్మకం ప్రకారం, జైనబ్బీ అమ్మవారు సీతమ్మవారి అంశ. అందుకే హిందువులు కూడా ఆమెను పూజిస్తారు. ప్రతి శుక్రవారం హిందూ, ముస్లిం భక్తులు ఇక్కడ కలిసి ప్రార్థనలు చేస్తూ, మత సామరస్యాన్ని చాటుతున్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...